Health: భయపెడుతున్న బీపీ.. అనారోగ్యానికి అసలు కారణమిదే

  • Written By:
  • Updated On - March 28, 2024 / 10:52 AM IST

Health: రక్త పోటు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బీపీతో బాధపడే వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల కన్జ్యూమర్ వాయిస్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా హెచ్చరించింది. భారత వైద్య పరిశోధనా మండలి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. పంజాబ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ సర్వేలో ఈ విషయం వెల్లడయింది.

ప్రపంచవ్యాప్తంగా ఏటా అధిక ఉప్పు వాడటం వల్ల సుమారు 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అధిక ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఆ మరణాలు ఆపొచ్చని పేర్కొంది. అలాగే రోజుకు2.5 గ్రాముల ఉప్పు, 3.5 గ్రాముల కన్నా తక్కువ పొటాషియం తీసుకోవాలని చెబుతుంది. అంతకుమించి వినియోగిస్తే తీవ్ర రక్త పోటుకు దారితీస్తుందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది రోజుకు 10 నుంచి 12 గ్రాములు ఉప్పును (సిఫారసు చేసిన దాని కంటే రెండింతలు ఎక్కువ) వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. పెద్దలు రోజుకు ఐదు గ్రాములు కన్నా తక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల బీపీ, గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

కిడ్నీ జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన తర్వాత అధైర్య పడొద్దు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ జీవించాలి. జబ్బును ఎదుర్కోవాలి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలి. ప్రధానంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకం తగ్గించాలి.