ఇప్పుడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితం(Busy Life)లో ధ్యానం(Dhyanam) కచ్చితంగా అవసరం. ధ్యానం రోజూ చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు. మనలో అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రోజూ ధ్యానం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ధ్యానం రోజూ చేయడం వలన కలిగే ప్రయోజనాలు..
*ధ్యానం వలన ఏకాగ్రత ఏర్పడుతుంది, ఏ పనినైనా తొందరగా చేయగలుగుతారు.
* ధ్యానం వలన మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
* ధ్యానం వలన మనలోని ఒత్తిడి, నిస్సత్తువ తొలగిపోయి ఉత్సాహం కలుగుతుంది.
* ధ్యానం వలన మనలోని భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి.
* ధ్యానం వలన వ్యక్తిగతంగా ఎదుగుదల ఏర్పడుతుంది.
* ధ్యానం మనలోని శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తుంది.
* రోజూ ధ్యానం చేయడం వలన గర్భవతులకు ప్రసవం సులువుగా అవుతుంది.
* రోజూ ధ్యానం చేయడం వలన అది మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరగడానికి సహాయపడుతుంది.
* రోజూ ధ్యానం చేయడం వలన మనకు ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది.
* ధ్యానం మనలోని జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.
* రోజూ ధ్యానం చేయడం వలన మనకు ఏమైనా ఆందోళనలు ఉన్నా అవి తొలగిపోయి ఆనందం కలుగుతుంది.