Eye Care: కంటి సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 49.5 లక్షల మంది అంధత్వానికి గురవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dry Eyes That Could Be The Disease!

Dry Eyes That Could Be The Disease!

Eye Care: భారతదేశంలో కంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాబట్టి కంటి ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 49.5 లక్షల మంది అంధత్వానికి గురవుతున్నారు. 7 కోట్ల మంది ప్రజలు తక్కువ దృష్టితో బాధపడుతున్నారు. వీరిలో 2.4 లక్షల మంది అంధ పిల్లలు కూడా ఉన్నారు. కంటిశుక్లం అంధత్వానికి అతిపెద్ద కారణం అంధత్వం అనేది ప్రాణాంతకమైనది కాదు, కానీ అది అనేక విధాలుగా వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవడం, కళ్లను పరీక్షించుకోవడం క్యాటరాక్ట్ మరియు డయాబెటిక్ రెటినోపతి వంటి అనేక వ్యాధులను నివారించవచ్చు.

పిల్లలు, యుక్తవయస్కులు: దాదాపు 6 నెలల వయస్సులో కంటి పరీక్షలు చేయించుకోవాలి. 3 సంవత్సరాల వయస్సులో పాఠశాల విద్యను ప్రారంభించే ముందు మళ్లీ పరీక్షలు చేసుకోవాలి. మీరు చదువుతున్న సమయంలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి  మిమ్మల్ని టెస్టులు జరిపించుకోవాలి. ఇక పెద్దలు (18-60): కంటి సమస్యలు లేదా ప్రమాదాలు లేకుంటే, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కంటి వైద్యుడిని చూడండి. మీరు కరెక్టివ్ లెన్స్‌లు ధరించినట్లయితే లేదా ఏవైనా సమస్యలు ఉంటే, ప్రతి సంవత్సరం మీ కళ్ళను పరీక్షించుకోండి.  సీనియర్ సిటిజన్లు (60+): 60 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం కళ్లను పరీక్షించుకోవాలి, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ కంటి చూపు బలహీనపడుతుంది.

గ్లాకోమా: వారి కుటుంబంలో కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రతి 1 నుండి 2 సంవత్సరాలకు ఒకసారి వారి కళ్లను పరీక్షించుకోవాలి. మీరు గ్లాకోమాతో బాధపడుతున్నట్లయితే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

మధుమేహం: మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు డయాబెటిక్ రెటినోపతికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సమస్యను నివారించడానికి, ప్రతి సంవత్సరం మీ కళ్ళను పరీక్షించుకోవడం మంచిది.

  Last Updated: 28 Oct 2023, 03:46 PM IST