అంజీర్ పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కేవలం అంజీర్ పండ్ల వల్ల మాత్రమే కాకుండా అంజీర్ నీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఒకటి లేదా రెండు అంజిర్లను ఒక కప్పు నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు వాటిని పీల్చుకొని ఉబ్బి పోనివ్వండి. తర్వాత రోజూ ఉదయం ఈ నీరు తాగి నానబెట్టిన ఆ అంజీర్ తినటంతో మీ రోజుని ప్రారంభించాలని చెబుతున్నారు. అలా ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ నీరు తాగడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ ఏర్పడుతుందట.
ఇందులో ఉండే అధిక యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ కంటెంట్ కారణంగా మెనోపాజ్ సమస్యలను, హార్మోన్ల అసమతుల్యత నుండి రక్షిస్తుందట. అలాగే మలబద్ధకంతో బాధపడే వారికి ఈ అంజీర్ నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందట. ఇది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుందట. అందువల్ల మలబద్ధకంతో బాధపడేవారు ఈ అంజీర్ వాటర్ ని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గించుకోవడానికి డైట్ లో ఉన్నట్లయితే అంజీర్ ని మీ ఆహార జాబితాలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు. కాగా అంజీర్ శరీరానికి ఫైబర్ ఆరోగ్యకరమైన మోతాదుని అందిస్తుందట.
అలాగే అంజీర్ వాటర్ తాగడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని వదిలించుకోవడానికి , రక్తపోటుని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. క్రమంగా కరోనరీ ఆర్టరీ బ్లాక్ ను నివారించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అలాగే అంజీర్లో పొటాషియం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ఈ అంజీర్ నానబెట్టిన నీటిని తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మెయింటెన్ అవుతాయి. ఇందులో ఉండే క్లోరోజెన్సీ ఆసిడ్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి టైప్ టు మధుమేహ వ్యాధి కిలస్తులు అంజీర్ నీటిని తాగుతూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.