Site icon HashtagU Telugu

Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ లెక్కింపు.. భారీగా ఆదాయం

Yadadri 1 Imresizer

Yadadri 1 Imresizer

Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 35 రోజుల పాటు హుండీ ఆదాయం కింద రూ.3,93,88,092(రూ.3 కోట్ల 93 లక్షల 88 వేల 92) నికర నగదు లభించింది. ఇందులో 174 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల మిశ్రమ వెండితో పాటు అమెరికా నుంచి 1359 డాలర్లు, ఇంగ్లండ్ నుంచి 25 పౌండ్లు, ఇంగ్లాండ్ నుంచి 55 పౌండ్లు, యూఏఈ నుంచి 65 దిర్హామ్లు, యూరప్ నుంచి 20 యూరోలు, నేపాల్ నుంచి రూ.10, 30 కెనడియన్ డాలర్లు, విదేశీ కరెన్సీలో ఇతర వస్తువులు ఉన్నాయి. గతంలో ఆలయ హుండీ రికార్డు ప్రకారం 35 రోజులకు రూ.2.82 కోట్ల నికర నగదు సమకూరింది.

అప్పటి కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించారు. కొన్ని కోట్ల నిధులతో ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. తెలంగాణలో ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం కూడా ఆలయా డెవలప్ మెంట్ కట్టుబడి ఉండటం, మరిన్ని వసతులు కల్పించడంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.