హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా హిందూ శాస్త్రంలో తులసి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. తులసి మాతను కూడా దైవంతో సమానంగా భావిస్తారు. పవిత్రంగా కొలుస్తారు. అందుకే ప్రతి శుక్రవారం లేదా ప్రతి రోజూ తులసి మొక్కకు పూజ చేస్తారు. అయితే పసుపు లేదా పసుపు కొమ్ముకు కూడా జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఎందుకంటే పసుపు కొమ్ము ఎన్నో సమస్యలను, లోపాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. అలాంటప్పుడు తులసిమొక్కకు పసుపు కొమ్మును కడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందువులు తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను ఉండటం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం ఉంది. అంతేకాదు తులసి మొక్కకు పూజ చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కూడా నమ్ముతారు. అలాగే కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో తులసి మాతకు పూజ చేస్తే పుణ్య ఫలాలు దక్కుతాయని అంటున్నారు పండితులు. తులసి పూజలో కూడా స్వచ్ఛత పట్ల శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. చాలా మంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. దీనివల్ల తులసి మొక్క అపవిత్రమౌతుందట. అలాగే శుభ ఫలితాలు కాస్త అశుభంగా మారి మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
తులసి పూజలో మీరు తప్పులు చేస్తే ఇంట్లో పెద్ద వాస్తు లోపాలు వస్తాయట. అందుకే తులసి మొక్క స్వచ్ఛతను తిరిగి పొందడానికి పసుపు ఒక్కటే నివారణ అంటున్నారు. తులసి మొక్కక్కకు పసుపు కొమ్మును కట్టడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే తులసి మొక్కపై పసుపును కూడా చల్లవచ్చట. ప్రతి శుక్రవారం తులసిపై పసుపు చల్లడం లేదా పసుపు కొమ్మును కట్టడం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. అలా కట్టిన ఆ పసుపు కొమ్మును ప్రతి శుక్రవారం మార్చాలట.
10 శుక్ర వారాలు ఇలా చేస్తే సరిపోతుందట. ఆ తర్వాత చివరి పసుపు కొమ్మును 11 వ శుక్రవారం కట్టి మిగిలిన 10 పసుపు కొమ్ములను నీటిలో ముంచండి. ఇది తులసి మొక్కను శుద్ధి చేస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు, నీటిని సమర్పించేటప్పుడు, తులసిని సంరక్షించేటప్పుడు లేదా మరేదైనా కారణం వల్ల తులసి అపవిత్రంగా మారితే స్వచ్ఛత తిరిగి పసుపు కొమ్ము తెస్తుందట. అలాగే తులసికి సంబంధించిన ఏదైనా లోపం తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని పండితులు చెబుతున్నారు.