Site icon HashtagU Telugu

Lord Shiva: నందికొమ్ముల నుంచే శివున్ని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా..?

Lord Shiva

Lord Shiva

హిందువులు సాధారణంగా ఏ దేవున్ని అయినా సరే…నేరుగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రమే దైవదర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నందికొమ్ముల నుంచి చూస్తూ దైవదర్శనం చేసుకుంటారు. ఆ తర్వాతే ఆలయంలోకి వెళ్లి శివున్ని దర్శించుకుంటారు. అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నందికొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి. నేరుగా వెళ్లి లింగాన్ని దర్శించుకుంటే ఏమైతుంది. అలా ఎందుకు చేయకూడదు. తెలుసుకుందాం.

శివుడు త్రిమూర్తులలో ఒకరు. కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు. శివున్ని లింగరూపంలో దర్శించుకోవాలి. శివుడు లయకారకుడు. మూడో కన్ను తేరిచినట్లయితే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అవుతుంది. అంతటి శక్తి శివుని మూడోకన్నుకు ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోవద్దు. ముందుగా నందికొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతేకానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. అలా వెళ్తే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.

నందికొమ్ముల నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నందివీపుపై నిమురుతూ మన కుడి చేతితో నందిచెవినిమూయాలి. తర్వాత మన మనస్సులో ఉన్న కోరికతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి. అలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాసా ప్రాప్తి కూడా కలుగుతుందట. మరో జన్మ కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.