Lakshmi Devi: దురదృష్టం వెంటాడుతోందా.. అయితే ఇలా చేస్తే లక్ష్మీ మీవెంటె?

ప్రస్తుత రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు. అంతేకాకుండా డబ్బు ఉంటేనే మనుషులు ఒకరకంగా డబ్బు లేకపోతే

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 06:00 AM IST

ప్రస్తుత రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగదు. అంతేకాకుండా డబ్బు ఉంటేనే మనుషులు ఒకరకంగా డబ్బు లేకపోతే ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపడి ఉండడంతో చాలామంది డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే వారి పరిస్థితులు మారకపోవడంతో వారి జీవితాలు ఇంతే అని అనుకుంటున్నారు. ఇక కష్టం చేసినా కూడా డబ్బులు మిగలకపోవడంతో దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఆర్థిక పరిస్థితులకు ఎటువంటి సమస్యలు ఉండవు.

ఇక ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే సంతోషంగా జీవించవచ్చు. కొన్ని రకాల పరిహారాలను పాటించడం వల్ల అదృష్టం కలిసి రావడంతో పాటు సంపద కూడా లభించి లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పుడు, కుటుంబంలో ఇతర సమస్యల వల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆదివారం రోజున తాంబూలం చెట్టును పూజించాలి. అలా చేసిన తర్వాత పూజ చేసిన స్థలంలో కొంచెం డబ్బులు అక్కడ ఉంచాలి ఆ విధంగా చేయడం వల్ల అదృష్టం మారడంతో పాటు కష్టాలు తీరి ఆర్థికంగా నిలదొక్కుకోలుగుతారు. అలాగే భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చుని తినడం వల్ల ఆనందం రెట్టింపు అవుతుంది.

భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా తూర్పు ముఖంగా కూర్చుని ఆహారం తీసుకోవాలి. ఆ విధంగా తినడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా కానీ పూజ చేసిన తర్వాత ఆ పూలు ఎండిపోయి ఉంటే వెంటనే వాటిని నీటిలో పడేయాలి. ఒకవేళ పారే నీరు దగ్గర్లో లేనప్పుడు వాటిని పాతి పెడితే సరిపోతుంది. అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర సాయంత్రం సమయంలో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో సానుకూలత పెంచుతుంది. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారు. తులసి చెట్లు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో గంగాజలంను చల్లాలి. ఇలా చేయడంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.