Site icon HashtagU Telugu

Eating Food: మంచంపై కూర్చొని భోజనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Eating Food

Eating Food

మామూలుగా మనం తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాం. వాటి కారణంగా మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది స్త్రీ పురుషులు భోజనం కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు. టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు.

కానీ సిటీలలో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్ పైన కూర్చుని కాళ్లు ఊపుతూ కదుపుతూ తింటూ ఉంటారు. ఎక్కువ మంది చేసే పొరపాటు మంచంపై కూర్చుని భోజనం చేయడం.. చిన్నపిల్లలకు అయితే మంచంపై కూర్చోబెట్టుకుని లేదా ఒళ్ళో కూర్చోబెట్టుకుని భోజనం తినిపిస్తూ ఉంటారు. కానీ పెద్దవారు కూడా మంచంపై కూర్చుని భోజనం పెట్టుకుని ఉంటారు. కానీ పూర్వం మన పెద్దలు అలా మంచంపై కూర్చుని భోజనం చేయకూడదని చెప్పేవారు. కానీ మంచం పైన కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్లకు పడుతుందని పెద్దలు అంటుంటారు. భోజనం అనేది మంచం మీద కూర్చుని తింటే అది రోగాలకు కారణం అవుతుందట.

అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుందట. కుటుంబంలో మనశ్శాంతి కరవైపోతుందట. అనవసరంగా చిన్న చిన్న విషయాలకే లేనిపోని గొడవలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయట. అందుకే భోజనం చేసేటపుడు భగవంతుడిని ప్రార్థించాలి. ఎందుకంటే మన దేహమే దేవాలయం. మన ఆత్మ భగవత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పబడింది. కనుక ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెపుతున్నారు. సైన్స్ పరంగా నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా మంచి మంచి లాభాలు