Vontimitta: నేటితో ముగియనున్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణంతో సమాప్తం

Vontimitta: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతంతో ఆలయంలో స్వామిని మేల్కొలిపి ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి శ్రీ సీతారామలక్ష్మణస్వామివారు ప్రత్యేక పల్లకిపై పుష్కరిణికి, ప్రత్యేక పల్లకిపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ కు ఊరేగారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల వరకు […]

Published By: HashtagU Telugu Desk
Vontimitta

Vontimitta

Vontimitta: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతంతో ఆలయంలో స్వామిని మేల్కొలిపి ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి శ్రీ సీతారామలక్ష్మణస్వామివారు ప్రత్యేక పల్లకిపై పుష్కరిణికి, ప్రత్యేక పల్లకిపై శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ కు ఊరేగారు.

ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంటల వరకు విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీచక్రతాళ్వార్ కు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు జపిస్తూ చక్రస్నానం చేశారు. గురువారం రాత్రి ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్ట లోని ప్రాచీన హిందూ దేవాలయం. ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఏపీలోని ప్రత్యేక ఆలయాల్లో ఈ గుడి ఒకటి కావడం విశేషం.

  Last Updated: 25 Apr 2024, 03:53 PM IST