Sandhya Deepam: సంధ్యా దీపం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?

ఇంట్లో చాలామంది ప్రతిరోజూ నిత్య దీపారాధన చేసే వారు ఉంటారు. ఇంకొందరు వారంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అలా చాలామం

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 08:00 PM IST

ఇంట్లో చాలామంది ప్రతిరోజూ నిత్య దీపారాధన చేసే వారు ఉంటారు. ఇంకొందరు వారంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు. అలా చాలామంది ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఇంటి గుమ్మం వద్ద కేవలం కార్తీకమాసం మాఘమాసం వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీప కాంతి జ్ఞాన సూత్రం. ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది.

అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరు. సంప్రదాయ బద్ధంగా నూనె దీపం వెలిగించడం అనేది ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించినపుడు దీప జ్వాల ఎల్లప్పుడు ఊర్ద్వముఖంగా సాగుతుంది. ఇది జ్ఞానం ఉన్నత స్థితికి దారి ఏర్పరుస్తుందనడానికి ప్రతీక. దీపానికి వాడే నెయ్యి లేదా తైలము మనలోని కోరికలకు ప్రతీక అయితే దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక. అహంకారాన్ని కాల్చేసి, కోరికలను ఆవిరి చేయడానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాము. అందుకే దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇకపోతే ప్రతి రోజూ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి ప్రసన్నమవుతుంది.

లక్ష్మీ దేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టవుతుంది. లక్ష్మిదేవి తప్పకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు. రోజూ సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ కూడా పోతుంది. ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి. అందుకే ప్రధాన ద్వారం దగ్గర నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అనారోగ్యాలు, కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ప్రదాన ద్వారం దగ్గర సంద్యా దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది. ఇంట్లోకి హానికారక కీటకాలు, పురుగులు వెలుగు ఉండడం వల్ల రావు. ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపును దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం. ఈ దీపాన్ని నెయ్యితో లేదా నూనెతో వెలిగించవచ్చు.