Vasthu Tips: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు మీకు రాజయోగం పట్టినట్టే?

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 09:37 PM IST

చాలామంది జీవితంలో రాజయోగం కలగాలని, అదృష్టం పట్టిపీడించాలని,అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ అతి ఆశే అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. ఇలాంటివన్నీ నెరవేరాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి శనివారం నాడు ఇంట్లో పగిలిన, విరిగిపోయిన వస్తువులను బయట పారేయాలి. శనివారం నాడు బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేయడం చేస్తే కూడా మంచి జరుగుతుంది. ఉదయం లేవగానే రెండు అరచేతులను చూసుకుని ఆ రోజును ప్రారంభిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

అంతేకాదు ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడడానికి పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన ఏదైనా వస్తువు ఉంటే ఆ రోజు శుభం జరుగుతుంది. మీ పర్సులో ఎప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతుంటే, ఎరుపు రంగులో ఉండే పర్సులను వాడితే కాస్త ఖర్చు తగ్గుతుంది. అవసరానికి మించి డబ్బు రావడం లేదని భావిస్తే కులదైవాన్ని మొక్కులు చెల్లించుకోవడం మంచిది అని, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే, సంపాదించిన డబ్బులు 10% దానధర్మాలు చేస్తే ఆర్థిక నిలకడ చేకూరుతుంది. ఒకవేళ డబ్బులకు ఇబ్బందిగా అనిపిస్తే చిన్న పిల్లలకు స్వీట్లు పంచితే ఇబ్బంది తొలగిపోతుంది. ఇక పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయ పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనప్రాప్తి కోసం ఏదైనా అమ్మవారి ఉపాసన చేయడం మంచిదని, అమ్మవారి వద్ద ఒక లవంగాన్ని ఉంచి ఉపాసన చేస్తే డబ్బు వస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఏడవకుండా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి రోజూ పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే డబ్బులు పెట్టే చోట కొన్ని అక్షింతలు, నాలుగు లక్ష్మీ గవ్వలు, నాలుగు చిన్న ఆకుపచ్చ గాజులు, నాలుగు శ్రీ ఫలాలు, శ్రీ సూక్తం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాదు ఎప్పుడూ 2 లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రం దగ్గర ఉంచుకోవడం వల్ల కూడా డబ్బుకు ఇబ్బంది ఉండదు.