ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం రకరకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. వాటితో పాటుగా వాస్తు విషయాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే, ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనశ్శాంతి కరువై ఉంటే అరటి చెట్టును పూజించాల్సిందే. కాగా అరటి చెట్టు మన ఇంట్లో వాస్తు దోషాలను తొలగించి, కుటుంబానికి శ్రేయస్సును, ఆర్థిక పుష్టిని ఇస్తుంది. మాములుగా అరటి చెట్టును ప్రతి శుభకార్యములలోనూ ఉపయోగించటం మనం చూస్తూ ఉంటాం.
తులసి ఆకులు, మామిడి ఆకులు, అరటి ఆకులు మొదలైనవి ఏ పూజలోనైనా ఉపయోగిస్తారు. అరటి చెట్టులో విష్ణువు నివసిస్తాడని నమ్ముతారు. విష్ణువును పూజించడం వల్ల విష్ణువు ప్రత్యేకమైన అనుగ్రహం కలుగుతుంది. అరటి చెట్టు మూలాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు. ఒక వ్యక్తి ఆర్థిక దారుణంగా మారినప్పుడు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే అతడు అరటి చెట్టు మూలానికి 11 సార్లు ప్రదక్షణ చేస్తే మంచి జరుగుతుంది. అరటి చెట్టు వేరులో బెల్లం, శనగపప్పు, పసుపు ముద్ద సమర్పించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో ప్రతికూలతలను తొలగించి సానుకూలతను తీసుకురావడానికి అరటి చెట్టు మూలాలను ఇంటి ప్రధానద్వారానికి కట్టడం మంచిది. ఇంట్లో ఆనందం శాంతి నెలకొల్పడానికి అరటి వేరుతో కలిపిన నీటిని ప్రతిరోజు సమర్పించినట్లయితే మంచి జరుగుతుంది. అరటి చెట్టు వేరును పూజించడం వల్ల మంగళ దోషం తొలగిపోతుంది. ఒక వ్యక్తి వివాహం జరగకుండా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అటువంటి వారు గురువారం రోజు పసుపురంగు దుస్తులు ధరించి పూజ చేయడం మంచిది. ఫలితంగా అతనికి వివాహం జరుగుతుంది. ఇక ధనవంతులు కావాలనుకునేవారు ఎర్రటి గుడ్డలో అరటి వేరును కట్టి తన గదిలో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది.