Ugadi 2024 : ఇవాళే తెలుగువారి నూతన సంవత్సరం. సోమవారం అమావాస్యతో శ్రీ శోభకృత నామసంవత్సరం ముగిసి మంగళవారం క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది. కలి గతాబ్దికి ప్రకారం.. నేటితో ఈ పుడమికి 5125 ఏళ్లు నిండుతాయి. క్రీస్తుశకం ప్రకారమైతే మనం 2024-25 సంవత్సరంలో ఉన్నాం. శాలివాహన శకం ప్రకారం..మనం 1946 సంవత్సరంలో ఉన్నాం. ఏదిఏమైనప్పటికీ ఇది తెలుగువారి నూతన సంవత్సరం. ఇవాళ షడ్రుచులు, తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు.. ఆరు రుచులు కలిపిన పచ్చడిని చేసుకుని కుటుంబ సభ్యులు మొత్తం తాగుతుంటారు. పంచాంగ శ్రవణం విని, ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది. వారికి ఈ క్రోధినామ సంవత్సరం కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకుంటారు. నవనాయక ఫలితాలను బట్టి ఈ ఏడాది ఎలా ఉండబోతోందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
క్రోధినామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా ఉంటుందట. ఈ సంవత్సరంలో ప్రజలు అధిక కోపం, ఆవేశంతో రగిలిపోతారని, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు పండితులు. ఈ సంవత్సరం దేశంలో, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కలుగుతాయంట. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే రిస్క్ ఉందని అంచనా వేస్తున్నారు. అనారోగ్య సమస్యలు కూడా అధికం అవుతాయని వార్నింగ్ ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join