Site icon HashtagU Telugu

Ayyappa Devotees : శబరిమల అయ్యప్ప భక్తుల దర్శనాలపై మూడు కీలక నిర్ణయాలు

Ayyappa Devotees Sabarimala Darshan Kerala Min

Ayyappa Devotees :  ఈసారి కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు జరగనున్నాయి. ఈతరుణంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) భక్తుల దర్శనానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి అయ్యప్ప భక్తులకు స్పాట్‌ బుకింగ్స్(Ayyappa Devotees) ఉండవని వెల్లడించింది. గతేడాది స్పాట్ బుకింగ్స్, ఆన్ లైన్ బుకింగ్స్ రెండింటినీ అనుమతించారు. దీంతో ప్రతిరోజూ సగటున లక్షన్నర మందికిపైగా భక్తులు శబరిమలకు వచ్చారు. అయితే వారందరికీ సరిపోయే రీతిలో క్యూ లైన్లను కానీ, దర్శనం కౌంటర్లను కానీ, రవాణా ఏర్పాట్లను కానీ చేయలేదు. ఫలితంగా వారిలో దాదాపు 80వేల నుంచి 90 వేలమందికి దర్శన అవకాశం దొరికే సరికే దాదాపు 20 గంటల టైం పట్టింది. దీంతో ఎంతోమంది భక్తులు అప్పట్లో శబరిమలకు వచ్చినా.. అయ్యప్ప స్వామివారి దర్శనాన్ని చేసుకోలేకపోయారు. మళ్లీ ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు స్పాట్ బుకింగ్స్‌ను ఆపేశామని శబరిమల ఆలయ బోర్డు వర్గాలు తెలిపాయి.

Also Read :China Vs Taiwan : తైవాన్ చుట్టూ చైనా ఆర్మీ.. భారీ సైనిక డ్రిల్స్