తిరుమల భక్తులు సోమవారం ఆలయ హుండీకి రూ.6.18 కోట్ల భారీ కానుకగా సమర్పించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటడం ఇది రెండోసారి. 2018 జూలై 26న హుండీలో రూ.6.28 కోట్ల విలువైన కానుకలు వచ్చాయి. భక్తులకు సర్వదర్శన భాగ్యం కల్పించి రెండేళ్లుగా తిరుమల దర్శనం చేసుకోలేని వారు స్వామివారి దర్శనానికి భారీగా హుండీ కానుకలు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. హుండీ విరాళాల లెక్కింపును టీటీడీ మంగళవారం అధికారికంగా ప్రకటించనుంది.
తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. కాగా, ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామివారిని దర్శించుకోగా, .37,447 తలనీలాలు ఇచ్చారు. ఆలయ హుండీలో భక్తులు కానుకల రూపంలో రూ.4.9 కోట్లు సమర్పించారు. ఎలాంటి టికెట్ లేకుండానే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారని, ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్ట్మెంట్లలో భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉండడంతో దర్శనానికి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.