TTD: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 05:13 PM IST

TTD: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబర్ 14న ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేశాయి.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న 72,230 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,388. బుధవారం స్వామివారి హుండీ మూలధనం 3.74 కోట్లు.

Also Read: Nirmala Sitharaman: మొరాకో ప‌ర్య‌ట‌న‌లో నిర్మ‌లా సీతారామ‌న్‌, ఆర్థిక విషయాలపై చర్చ