TTD Key Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Key Decisions) వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి జూలై 15, 2025 వరకు ప్రయోగాత్మకంగా ఈ మార్పులు అమలు కానున్నాయి. ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త షెడ్యూల్ ప్రకారం..వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఉన్న 5:30 లేదా 8 గంటల సమయం నుంచి ఈ మార్పు జరిగింది.
ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం సామాన్య భక్తులకు సౌకర్యం కల్పించడం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రాత్రంతా వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అవకాశం కల్పించి, వసతి సమస్యలను తగ్గించడం లక్ష్యంగా ఉంది. వేసవి కాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మార్పు సామాన్య భక్తులకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.
అయితే గతంలో 2022 డిసెంబర్లో సమయ మార్పు (8:30-11:30 AM) వల్ల వీఐపీ గెస్ట్హౌస్ల ఖాళీ సమయాల్లో ఆలస్యం, భక్తులకు వసతి సమస్యలు ఎదురైనట్లు నివేదికలు ఉన్నాయి. ప్రస్తుత మార్పు ఈ సమస్యలను పరిష్కరించేలా ఉంటుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్కు రూ.10,000 విరాళం ఇవ్వడం, రూ.500 టికెట్ ఫీజు చెల్లించడం ద్వారా భక్తులు అర్హత సాధించవచ్చు. ఈ దర్శనం సాధారణంగా 30-45 నిమిషాల్లో పూర్తవుతుంది. రద్దీ ఎక్కువగా ఉంటే 1-2 గంటల వరకు పట్టవచ్చు. ఈ మార్పులపై X పోస్టుల్లో కొంతమంది సామాన్య భక్తుల ప్రాధాన్యతను స్వాగతిస్తుండగా, మరికొందరు వీఐపీ జాబితాను పరిమితం చేయాలని సూచిస్తున్నారు.
Also Read: Mangoes With Chemicals: కెమికల్స్ కలిపిన మామిడికాయలు తింటే వచ్చే సమ్యలివే!
టీటీడీ కీలక నిర్ణయాలు
- శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ మే 1వ తేదీ నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది.
- వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 1 నుండి జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది.
- అదేవిధంగా మే 2 నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్పివీఐపీలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది.