తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా రెండు రోజులు కొంత సమయంపాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 వరకు, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు