Pooja: దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించడం తప్పనిసరి?

మామూలుగా చాలామంది పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల అనేక రకరకాల సమస్యలను కూడా ఎదు

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 08:38 PM IST

మామూలుగా చాలామంది పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల అనేక రకరకాల సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లో లేదంటే పూజా మందిరంలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నాపెద్దగా ఉండరాదు. మంత్ర పుష్పం, సుప్రభాతం కుర్చుని చదవరాదు. ఈశ్వరుడుకి పవళింపు సేవ నిలబడి చేయకూడదు. నుదుట బొట్టు, విభూతి లేదా కనీసం బొట్టు అయిన లేకుండా పూజ చేయకూడదు.

ఈశ్వరుడికి, గురువుకి ఒక చేతితో నమస్కారం చేయరాదు అలా చేస్తే పై జన్మలో చేతులు లేకుండా జన్మించటం, చేతులు పోవటం కానీ జరుగుతాయి. అలాగే ఈశ్వరునిక వీపు చూపరాదు, ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మప్రదక్షిణ చేయరాదు. ఈశ్వరుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం. కాబట్టి ఆ దీపారాధనతో పుల్లలు కానీ, సాంబ్రాణికడ్డి కానీ, హారతి కర్పూరం కానీ మరి ఏదైనా కానీ వెలిగించకూడదు. పూజ సమయంలో ఈశ్వరుడు మన కంటే ఎత్తులో వుండాలి, అలానే పూజా వస్తువులు కుడి వైపు నుంచి తీసుకోవాలి. ఎడమ చేయి పూజా విధులలో నిషేధం. ఆచమనం చేసేటప్పుడు శబ్దం రాకూడదు. ఈశ్వర నిర్మాల్యం కాలితో తొక్కరాదు. అలాచేస్తే ఈ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించును.

రుద్రాక్షలు ధరించే వారు మద్యం, మాంసము, ఉల్లి, వెల్లుల్లి, మునగ, శ్లేషాత్మక పదార్ధాలు తినకూడదు. స్త్రీలు చేయకూడని కొన్ని పొరపాట్ల విషయానికి వస్తే.. స్త్రీలు తులసీ దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలెను. పౌర్ణమి, అమావాస్య నాడు, రవి సంక్రమణ, తైలాభ్యంగన స్నానం చేసిన కూడా త్రి సంధ్యల కాలంలో, మైల రోజులలో, రాత్రి ధరించి ఉన్న దుస్తులతోను, స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించకుండా, తులసిని తుంచినా కూడా మహాపాపం.

అలాగే స్త్రీలు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు. ఇలా స్త్రీలు చేస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అశుభం. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు. అలా కనపడితే భర్తకి గండం. పూర్తిగా శిరో ముండనం చేసుకోకూడదు కనీసం శిఖ ఉంచుకోవాలి. అలా చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పూర్తిగా శిరో ముండనం చేసుకుంటే వైదిక క్రియలకి పనికిరాదు. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి, ఇత్యాదుల యందు, వ్రత దినముల యందు, శ్రాద్ధ దినముల యందు, మంగళ, శనివారముల యందు క్షురకర్మ పనికిరాదు.