Vastu Tips: ఈ స్రుగంధ ద్రవ్యాలు మీ వెంట ఉంటే చాలు.. డబ్బే డబ్బు?

ప్రతి ఒక్కరి వంటింట్లో సుగంధ ద్రవ్యాలు తప్పకుండా ఉంటాయి. అవి ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. చాలామందికి తె

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 08:12 PM IST

ప్రతి ఒక్కరి వంటింట్లో సుగంధ ద్రవ్యాలు తప్పకుండా ఉంటాయి. అవి ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సుగంధద్రవ్యాలను కేవలం కిచెన్ లో మాత్రమే కాకుండా హ్యాండ్ బ్యాగ్ లేదా వాలెట్ లోపల పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను తొలగించుకోవచ్చు. అయితే ఈ పదార్థాలు ఎప్పుడు మీ వెంట ఉంటే అడ్డంకులు అన్ని తొలగిపోతాయి. మీరు అభివృద్ది చెందడానికి తక్షణమే సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. మరి అసలు సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటి? వాటిని మనతో పాటు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రెండు మసాలా దినుసులు ప్రతికూల శక్తులని ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తారనే నమ్మకం కొన్ని యుగాలుగా ఉంది. అనేక సంస్కృతులలో తలుపు లేదా గుమ్మానికి సోంపు లేదా లవంగం ఉన్న చిన్న మూట కట్టి పెడతారు. ఇవి దెయ్యాలు, ఆత్మలని ఇంటికి దూరంగా ఉంచుతాయని నమ్ముతారు. అంతేకాదు సోంపు తల దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల బాగా నిద్రపట్టడానికి సహాయపడతాయి. లవంగాన్ని పర్సులో ఉంచుకోవడం వల్ల ప్రతికూలత పరిస్థితులకి దూరంగా ఉంచుతుంది. సోంపు, లవంగం తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి, దీర్ఘాయువు, ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, ధైర్యం, బలం పెరుగుతాయి. లక్ష్మీ దేవికి ఎర్ర గులాబీలతో పాటు లవంగాలు కలిపి పూజ చేయడం ద్వారా అదృష్టం, డబ్బు కలిసి వస్తాయని నమ్ముతారు. గరం మసాలా వేయడం వల్ల వంటకం ఏదైనా చాలా రుచిగా ఉంటుంది.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మసాలా మీకు సంపడం విజయాన్ని ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఈ మసాలా ప్యాకెట్ మీ వాలెట్ లో ఉంచుకోండి. లేదంటే ఈ పొడి ఇల్లు లేదా షాపు మూలల్లో చల్లుకోవచ్చు. ఇది విజయం వరించేలా అదృష్టం, డబ్బు తీసుకొస్తుంది. అలాగే పొదుపు పెంచుకోవడానికి చేయాల్సిందల్లా దాల్చిన చెక్కని పర్సులో ఉంచుకోవడం. ఇది ఆరోగ్యం, ప్రేమ, విజయం అందిస్తుంది. ఇది దగ్గర పెట్టుకోవడం వల్ల మన చుట్టూ పాజిటివిటీ ఉంటుందని అంటారు. వాస్తు ప్రకారం సంపద పొందేందుకు ఇది అద్భుతమైన మూలిక మార్గం. వాలెట్ లేదా డబ్బులు ఉండే ప్రదేశంలో 2-3 పుదీనా ఆకులు ఉంచుకుంటే మంచిది. దాని సువాసన మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు పెట్టె పెట్టుబడులు విజయవంతంగా సురక్షితంగా ఉండేలా చేస్తుంది. సంపద పెంచుకోవడానికి పుదీనా ఆకుల రంగు డబ్బు నోట్లకి అయ్యేలా చూసుకుంటే మంచిదని నమ్మకం. ఇక పచ్చ యాలకులు, నల్ల మిరియాలు తీసుకుంటే ఇంట్లోని కష్టాలు తీరిపోతాయని నమ్ముతారు. యాలకులు తింటే మనసుని శాంతపరిచి, గందరగోళం తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. జీవితంలో కెరీర్ వృద్ది అవకాశాలని ఆహ్వానించడానికి ఈ మసాలా తింటే మంచి ఫలితం పొందుతారు.