Site icon HashtagU Telugu

Sri Ananta Padmanabha Swami Temple : శ్రీ అనంత పద్మనాభ దేవాలయం విశిష్టత

Special Feature Of Sri Ananta Padmanabha Temple

Special Feature Of Sri Ananta Padmanabha Temple

Sri Ananta Padmanabha Swami Temple : భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని ఈస్ట్ పోర్ట్ లోపల ఉన్న శ్రీ అనంత పద్మనాభ దేవాలయం విష్ణుమూర్తిని ఆరాధించే దేవాలయం. ఈ దేవాలయంలో కేరళ మరియు ద్రవిడ శైలి నిర్మాణం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా భావిస్తారు.

శ్రీ అనంత పద్మనాభ దేవాలయం (Sri Ananta Padmanabha Swami Temple) చరిత్ర 8వ శతాబ్ధానికి సంబంధించినది. భారతదేశంలోని 108 పవిత్ర విష్ణు దేవాలయాలు లేదా దివ్యదేశాల్లో ఇది ఒకటి. దివ్య దేశాలు అనేవి తమిళ ఆళ్వార్ల రచనల్లో పేర్కొనబడ్డ విష్ణుమూర్తి యొక్క పవిత్ర దేవాలయాలు. ఈ దేవాలయంలో పూజలు అందుకునే స్వామి విష్ణుమూర్తి, పాము పడగలపై నిద్రిస్తూ స్వామివారు ఉంటారు.

ప్రముఖ ట్రావన్కూరు రాజుల్లో ఒకరు అయిన మార్తండ వర్మ దేవాలయానికి అనేక మరమ్మత్తులు చేశారు మరియు దాని ఫలితంగానే శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం ప్రస్తుత రూపంలో ఉంది. మర్తాండ వర్మనే దేవాలయంలో మురజపం మరియు భద్రదీపం వంటి పండుగలను ప్రవేశపెట్టారు. మురజపం అనేది, నిరాఘాటంగా పూజలు చేయడం, ఇది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒక్కసారి దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటారు.

We’re on WhatsApp. Click to Join.

1750లో, మార్తాండ వర్మ ట్రావన్కూరు సంస్థానాన్ని పద్మనాభుడికి అంకితం ఇచ్చాడు. విష్ణుమూర్తి తరఫున రాజకుటుంబం రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మర్తాండ వర్మ ప్రకటించారు మరియు ఆయన మరియు ఆయన వారసులు పద్మనాభ దాసులు లేదా పద్మనాభ స్వామి సేవకులుగా రాజ్యానికి సేవ చేశారు. అప్పటి నుంచి ప్రతి ట్రావెన్‌కూర్ రాజు చివర పద్మనాభదాస అనే పేరు వచ్చింది. పద్మనాభ స్వామికి ట్రావెన్‌కూర్ సంస్థానం ఇచ్చిన దానాలను తిరిపడిదానంగా పేర్కొంటారు.

కేరళ రాజధాని తిరువనంతపురానికి, శ్రీ పద్మనాభస్వామి యొక్క పేరు నుంచి వచ్చింది, అనంత అంటే అనంతమైన సర్పంపై ఉండే వ్యక్తి అని అర్థం. ‘‘తిరువనంతపురం’’ అనే పదానికి -శ్రీ అనంత పద్మనాభ స్వామి భూమి అని అర్థం.

ఏడు పరుశురామ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లే ప్రదేశంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి (Sri Ananta Padmanabha Swami) భూమి దేవాలయాన్ని ఉన్నట్లుగా విశ్వసిస్తారు. ఈ దేవాలయానికి సంబంధించి స్కంద పురాణం మరియు పద్మ పురాణం వంటి పురుణాల్లో కూడా ప్రస్తావన ఉంది. ఈ దేవాలయం ప్రసిద్ధ కోనేరు- పద్మపాదానికి దగ్గరల్లో ఉంటుంది.

ట్రావెన్‌కూర్ రాజకుటుంబానికి చెందిన ట్రస్టీల ద్వారా ఈ దేవాలయం ప్రస్తుతం నిర్వహించబడుతోంది.

 

Sri Ananta Padmanabha Swami విగ్రహం..

శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం యొక్క కూర్పు గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి, ఇది 12008 సాలగ్రామాలతో రూపొందించబడింది, వీటిని నేపాల్‌లోని గండకి నదీ తీరం నుంచి తీసుకొచ్చారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి (Sri Ananta Padmanabha Swami) యొక్క గర్భగుడి ఒక రాతి స్లాబ్‌‌పై ఉంటుంది, అలానే ప్రధాన విగ్రహం 18 అడుగుల ఎత్తు ఉంటుంది, మూడు విభిన్న ద్వారాల ద్వారా స్వామిని వీక్షించవచ్చు. తల మరియు ఛాతీని ప్రధాన ద్వారం ద్వారా చూడవచ్చు, తలను రెండో ద్వారం ద్వారం ద్వారాను మరియు పాదాలను మూడో ద్వారం ద్వారా చూడవచ్చు.

సౌందర్యం మరియు ఆర్కటెక్చర్

దేవాలయంలో రాతి మరియు కంచుతో చేసిన కళారూపాలు కనిపిస్తుంది. దేవాలయం లోపలి భాగంలో అందమైన పెయింటింగ్‌లు మరియు మురల్ చిత్రాలుంటాయి. వీటిలో పవళించే భంగిమలో ఉండే విష్ణుమూర్తి, నరసింహ స్వామి ( విష్ణుమూర్తి యొక్క నరసింహావతారం), గజపతి మరియు గజపతి యొక్క లైఫ్ సైజ్ చిత్రాలు చాలా ప్రసిద్ధి. దేవాలయం యొక్క ధ్వజస్తంభం సుమారు 80 అడుగులఎత్తు ఉంటుంది మరియు దీనికి బంగారం పూత పూయబడ్డ రాగిరేకులు తాపడం చేయబడ్డాయి. ఈ దేవాలయంలో బలిపీట మండం మరియు ముఖ మండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఉన్నాయి. వివిధ హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ హాళ్లు అలంకరించబడ్డాయి. ఇక్కడ భక్తుల మదిని దోచే మరో నిర్మాణం నవగ్రహ మండపం, దీని యొక్క పై భాగంలో నవగ్రహాలు కనిపిస్తాయి.

కారిడార్ తూర్పువైపు నుంచి ఇది గర్భగుడిలోనికి వెళుతుంది, ఇది చాలా విశాలమైన కారిడర్, దీనిలో అద్భుతమైన చెక్కబడ్డ 365కు పైగా గ్రానైట్ రాతి స్తంభాలుంటాయి. తూర్పు వైపున ప్రధాన ద్వారానికి దిగువన ఉండే గ్రౌండ్ ఫ్లోరుని నాటకశాల అని అంటారు, దీనిలో దేవాలయంలో వార్షికంగా మలయాళం నెలలైన మీనం మరియు తులంలో జరిగే పది రోజుల ఉత్సవాల సమయంలో కేరళ యొక్క సాంస్కృతిక కళారూపమైన కథాకళిని ప్రదర్శిస్తారు.

శ్రీ అనంత పద్మనాభ దేవాలయం తెరిచి ఉండే సమయాలు..

ఉదయం వేళలు 03:30 a.m. నుంచి 04:45 a.m. (నిర్మల్య దర్శనం) 06:30 a.m. to 07:00 a.m. 8.30 a.m. to 10:00 a.m. 10:30 a.m. to 11:10 a.m. 11:45 a.m. to 12:00 Noon సాయంత్రం వేళలు: 05:00 p.m. to 06:15 p.m. 06:45 p.m. to 07:20 p.m.

పండగ సీజన్‌లో దేవాలయం తెరిచి ఉండే సమయాల్లో మార్పులు ఉండవచ్చనే విషయాన్ని దయచేసి గమనించండి.

దేవాలయంలో డ్రెస్ కోడ్ పాటించాలి..

కేవలం హిందువులు మాత్రమే దేవాలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతించబడతారు. దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి. పురుషులు ముండు లేదా ధోతి ( లుంగీ వంటివి) మరియు ఎలాంటి షర్టును ధరించరాదు. మహిళలు చీరలు, ముండమ్ నెరియాత్తం (సెట్- ముండు), లంగా మరియు జాకెట్, లేదా ఓణీలు వేసుకోవచ్చు. దేవాలయం ఆవరణలో ధోతీలు అద్దెకు లభిస్తాయి, భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండటం కొరకు ప్యాంట్‌లపై ధోతీలు లేదా చూడీదార్ ధరించేందుకు దేవాలయం అధికారులు ఇప్పుడు అనుమతిస్తున్నారు. మరిన్ని వివరాల కొరకు లాగిన్ అవ్వండి

Also Read:  Turmeric Board Telangana : 9 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన పసుపు రైతు