తిరుపతి ఆలయ దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఇప్పుడు భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) రూ. 300 ఆన్లైన్ దర్శన టిక్కెట్ను ఈ నెల 13న విడుదల చేయనుంది. డిసెంబర్ 16, 31వ తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఈ టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను ఈ నెల 13న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. http://tirupatibalaji.ap.gov.in/ వెబ్ సైట్లో ఈ టిక్కెట్లను బుక్ చేస్కోవాలని టీటీడీ తెలిపింది. కాగా, మాండూస్ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీటీడీ ఘాట్ రోడ్లపై ద్విచక్రవాహనాల రాకపోకలను నిషేదించింది. ఈ నెల 16, 31 తేదీల్లో ఆన్లైన్ కోటా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Arunachalam: అరుణాచలానికి సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు..!
టీటీడీ ఐటీ విభాగం తాజాగా కొత్త యాప్ను తీసుకొస్తోంది. ఇప్పటికే యాప్ దాదాపు పూర్తికాగా.. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. టీటీడీ తీసుకొస్తున్న ఈ యాప్ ద్వారా పూర్తి సమచారాన్ని పొందొచ్చు. ఇదిలా ఉంటే భక్తులు ప్రస్తుతం దర్శనం, రూమ్ బుకింగ్ వంటివి టీటీడీ వెబ్సైట్లో చేసుకుంటున్నారు. కానీ ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఇకపై దర్శనం, గదులు, శ్రీవారి సేవా టికెట్లను యాప్లోనే బుక్ చేసుకోవచ్చు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.