Site icon HashtagU Telugu

Rudraksha: రుద్రాక్ష ఎలా ఉద్భవించింది.. దీనిని ధరించడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా?

Rudraksha

Rudraksha

మామూలుగా మనం మెడలో రుద్రాక్ష మాలలను ధరించడం చూసే ఉంటాం. రుద్రాక్షలు అనేక రకాల రుద్రాక్షలు ఉన్నాయి. కొందరు పంచముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష అని ఇలా రకరకాల ముఖాలు ఉన్న రుద్రాక్షలను మెడలో ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పరమేశ్వరుని ఎక్కువగా పూజిస్తూ ఆరాధించేవారు తప్పకుండా మెడలో రుద్రాక్ష మాలలను ధరిస్తూ ఉంటారు. ఇకపోతే హిందూ మతంలో ప్రదోష ఉపవాసం ప్రతి నెల కృష్ణ, శుక్ల పక్ష త్రయోదశి రోజున ఆచరిస్తారు.

ప్రదోష ఉపవాసం శివుడికి అంకితం చేయబడింది. ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రదోష వ్రతం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. ప్రదోష ఉపవాసం రోజున రుద్రాక్ష ధరించడం కూడా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుందట. రుద్రాక్షకు శివునితో చాలా లోతైన సంబంధం ఉంది. రుద్రాక్ష ధరించే వ్యక్తులు కొన్ని నియమాలను పాటించాలట. దీన్ని ధరించడం చాలా ప్రయోజనకరం అని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. పురాతన కాలంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భూమిపై భయాన్ని సృష్టించాడు.

అంతేకాదు దేవతలను కూడా త్రిపురాసురుడి చాలా ఇబ్బందులు పెట్టారు. త్రిపురాసురుడిని ఓడించడంలో దేవతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. చివరికి దేవతలందరూ శివుని వద్దకు చేరుకొని శరణ కోరారు. దేవతలు శివుని వద్దకు చేరుకున్న సమయంలో శివుడు యోగాసనంలో ధ్యానంలో మునిగి ఉన్నాడు. మహా దేవుడి తపస్సు పూర్తయిన తర్వాత అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు భూమిపై పడ్డాయి. శివుని కన్నీళ్లు ఎక్కడ పడ్డాయో అక్కడ రుద్రాక్ష వృక్షాలు పెరిగాయి. అంటే రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించాయి. మహాదేవుడు త్రిపురాసురుడిని సంహరించాడు. ఈ రుద్రాక్షలలో 14 రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం సోమవారం, ప్రదోష ఉపవాసం చేసే సమయంలో రుద్రాక్షను ధరించాలని నమ్ముతారు. కాగా ఈ రుద్రాక్షలు ధరించే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుందట. వారు ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తారని, రుద్రాక్ష ధరించే వారిపై మహాదేవుని ఆశీస్సులు ఉంటాయని,పాపాలు కూడా నశిస్తాయని,శారీరక వ్యాధులు తొలగిపోతాయని భయాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.