హిందువుల ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది తప్పనిసరిగా ఉంటుంది. ఈ పూజ గదిలో రకరకాల దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. అయితే ఇల్లు ఎంత ఇరుకుగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా దేవుడి కోసం కొంచెం స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది పూజ గది విషయంలో చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయట. అయితే పూజ గది విషయంలో చేసే కొన్ని చిన్న మార్పులు చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి పూజగది విషయంలో పాటించవలసిన నియమాలు మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మీకు వీలు అయితే మన ఇంట్లో సూర్యకాంతి పడే ప్రదేశంలో దేవుడి గది ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.
సూర్య కిరణాలు దేవుడు చిత్రపటాలపై విగ్రహాలపై పడితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. ఇంట్లో ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే ఇంట్లో దేవుడి గది ఏర్పాటు చేసుకుని దేవతామూర్తులను ఏర్పాటు చేసుకోగానే దేవుడు ఇంట్లో వెలసినట్టు కాదట. దేవుడికి నిత్యం దీపారాధన చేస్తుండాలి. అది కూడా ఏ ఇంట్లో అయితే ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దైవిక శక్తి ఉంటుందట. అలాగే పూజలు చేసేటప్పుడు ధూపం, దీపం, నైవేద్యం తప్పనిసరిగా వెయ్యాలని చెబుతున్నారు. పూజ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ పూజ దగ్గర ఉండేలా చూసుకోవాలట.
అదే విదంగా ఇంట్లో గంట మోగించాలి. కొందరికి ఇంట్లో చెప్పులు, షూస్ వేసుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు చెప్పులు, షూస్ వంటివి ధరించి ఇంట్లో దేవుడి పూజ గది దగ్గరకు వెళ్లకూడదట. దీని వల్ల ఇంట్లో దైవ శక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేస్తే దేవతలను అనుమానించినట్టే అవుతుందట. చాలామందికి పెద్దలంటే భక్తి, గౌరవం ఉంటాయి. అందుకే దేవుడి గదిలో మరణించిన పెద్దల ఫొటోలను ఉంచుతుంటారు. కానీ దేవుడి పటాల మధ్య పెద్దల ఫొటోలను ఉంచుకోవడం మంచిది కాదట. దీనికి బదులుగా పెద్దల ఫొటోలను ఇంట్లో దక్షిణ దిక్కులో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో దేవుడి గది దగ్గర ఎట్టి పరిస్థితులలోనూ టాయిలెట్ ఉండకూడదట. కొందరు ఇంటి స్థలం సరిపోలేదనో లేక ఇంటి ప్లానింగ్ కారణంగానో పూజ గది దగ్గర టాయిలెట్ ఏర్పాటు చేయిస్తుంటారు. కానీ ఇది మంచిది కాదట..