Ram Lalla: బాల రామచంద్రుడి వజ్రాల ఆభరణాల మొత్తం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

500 ఏళ్ల హిందువుల కల సోమవారం సాకారం అయింది. తన జన్మ భూమి అయోధ్యలో రామయ్య కొలువు దీరాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రామ

  • Written By:
  • Publish Date - January 23, 2024 / 03:00 PM IST

500 ఏళ్ల హిందువుల కల సోమవారం సాకారం అయింది. తన జన్మ భూమి అయోధ్యలో రామయ్య కొలువు దీరాడు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యకమం జరిగింది. శ్రీ రామ చంద్రుడు ఐదేళ్ళ బాలుడుగా విల్లు, ధనుస్సు చేత బట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనం ఇస్తున్నారు. స్వామివారికి అలంకరించిన బంగారు వజ్రాల ఆభరణాలను చూసి భక్తులు చూపును పక్కకు తిప్పుకోలేకపోతున్నారు. పెద్దగా అలంకరణ లేకపోయినా కూడా ఆ వజ్రవైఢూర్యాలతో శ్రీరామచంద్రుడు మెరిసిపోతున్నాడు. శరీరం మొత్తం వజ్రాలు బంగారు చేసిన ఆభరణాలను వేయడంతో బాల రాముడు మెరిసిపోతున్నారు.

అయితే రాములవారికి ధరించిన ఆ బంగారు ఆభరణాలను ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్‌‌స్టిట్యూట్ సర్టిఫికేషన్​ పొందిన ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ఉన్న హర్షహైమల్ షియామ్‌లాల్ జ్యువెలర్స్ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను రూపొందించింది. నల్లని రామయ్య బంగారు నగలతో ముగ్ద మనోహర రూపంలో కనిపించాడు. రామయ్యకు అలంకరించిన ఆభరణాలను దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారట. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. బాల రామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్‌కట్ వజ్రాలు ఉన్నాయట.

అలాగే బాల రాముడు కి పెట్టిన కిరీటం వజ్రాలు పచ్చలు, కెంపులతో పొదగబడింది. ఆ కిరీటం బరువు దాదాపుగా 1.7 కిలోలు ఉంటుంది. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాల కూడా ఉన్నాయి. కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారంకి ఒకటి. అలాగే ఆధ్యాత్మికతకు, భక్తుల ను రక్షించే రక్షిత చిహ్నంగా నుదిట తిలకాన్ని భావిస్తారు ఇది సుమారు సుమారు16 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ సహజ వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లు ఉండే చిన్న వజ్రాలు, బర్మీస్ కెంపులు ఉన్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలను వినియోగించినట్లు ఆనంద్ తెలిపారు. రామ చంద్రుడు కుడి చేతికి ధరించిన ఉంగరం 65 గ్రాములు ఉంటుంది. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉంటాయి. ఇక ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్ లో వజ్రాలు, కెంపులు ఉన్నాయి.

బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది, 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. బాల రామయ్య నడుమ పట్టీ సుమారు 750 గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు. ఈ పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలను పొదిగారు. చేతి కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు. అంతేకాదు ఒక్కో కడియం బరువు 400 గ్రాములకు పైగానే ఉంటుంది. ఇలా మొత్తంగా రాములవారికి కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు బంగారు ఆభరణాలను అలంకరించారు. వాటి మొత్తం ధర కొట్లలో ఉంటుందని తెలుస్తోంది.