Lakshmi Devi: ఐశ్వర్యం డబ్బుతో పాటు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఈ పనులు చేయాల్సిందే?

జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బు బాగా సంపాదించి ఆర్థిక సమస్యలు లేకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ

  • Written By:
  • Publish Date - January 28, 2023 / 06:00 AM IST

జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బు బాగా సంపాదించి ఆర్థిక సమస్యలు లేకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. అయితే చాలామంది వాస్తు శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తి, ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అందుకోసం మీరు శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదంటే ఎర్ర గులాబీ పూలు సమర్పించాలి. పూజ సమయంలో శ్రీ సూక్తాన్ని పట్టించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకధార స్తోత్రం పాటించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరతాయి. అలాగే మీరు సంపాదించిన డబ్బులు స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని గణేశుడుని ఇద్దరిని కలిసి పోషించాలి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్లి కమలం తెల్ల మిఠాయిలు శంఖం వంటివి సమర్పించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది.

ఐశ్వర్యంతో పాటు సంతానం కావాలి అనుకున్న వారు గజలక్ష్మి పూజించడం వల్ల సంతానంతో పాటు సంపద ఆస్తి కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పూజ స్థలంలో శ్రీ యంత్రాన్నీ స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే పూజా స్థలంలో సోమ పుష్య యోగంలో దక్షిణవర్తి శంఖాన్ని ప్రతిష్టించండి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోయి లక్ష్మీ దేవి ,విష్ణువు ఆశీర్వాదం పొందుతారు.