Vasthu Tips: ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలంటే వెంటనే ఇలా చేయండి?

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 09:43 PM IST

ఈ రోజుల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పది మందిలో 8 మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులకు అనేక రకాల కారణాలు ఉండగా అందులో వాస్తు దోషం కూడా ఒకటి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాస్తు సరిగా లేకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండదట. ఇంట్లో లక్ష్మీ దేవి తిరగాలి అంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట.

ముఖ్యంగా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే.. లక్ష్మీ కాటాక్షం అంత పెరుగుతుంది.. అలాగే ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. గృహోపకరణాలను సరైన స్థలంలో ఉంచాలి. చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంటి సభ్యుల పనులన్నీ చక్కగా జరుగుతాయి. ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుందట.

వాస్తు ప్రకారం, ఇంట్లోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేయాలి. ఫర్నీచర్, సోఫాలు, బెడ్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇళ్లు ఉడ్చుకోవాలి. ఇంటి బాత్‌రూమ్‌, టెర్రస్‌, బాల్కనీని కూడా సరిగ్గా శుభ్రం చేయాలి..ఇంట్లో బుజును ప్రతి 10 రోజులకు ఓసారి దులుపుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే వాస్తు దోషం వెంటాడుతుంది. వాస్తు ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఎందుకంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయంగా భావిస్తారు. చెత్తను బయట వేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. కాబట్టి పైన చెప్పిన విషయాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడవచ్చు.