Srisailam: కార్తీక మాసం ఎఫెక్ట్, శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ

Srisailam: కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో శ్రీశైలం శ్రీ బ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఆదివారం భారీ రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పూజల అనంతరం 3 గంటలకు భక్తులను ఆలయంలోకి అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Srisailam

Srisailam

Srisailam: కార్తీక మాసం ముగియనున్న నేపథ్యంలో శ్రీశైలం శ్రీ బ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఆదివారం భారీ రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు, ప్రత్యేక పూజల అనంతరం 3 గంటలకు భక్తులను ఆలయంలోకి అనుమతించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఆర్జిత చండీ హోమం, రుద్ర హోమం దశలవారీగా నిర్వహిస్తారు. దర్శన ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు అధిక రద్దీని నిర్వహించడానికి, కార్తీక మాసంలో గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం వంటి కొన్ని పూజలు నిలిపివేశారు. కాగా  సోమవారం కూడా భక్తుల రద్దీ అలాగే ఉంది.

  Last Updated: 04 Dec 2023, 10:26 AM IST