ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఆర్థిక సమస్యలు కూడా ఒకటి. ఎంత డబ్బు సంపాదించినా కూడా మిగలకపోగా అప్పులు చేయాల్సి వస్తోంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మనకు గరుడ పురాణంలో కొన్ని రకాల విషయాలను తెలిపింది. జనన-మరణాలతో పాటు జ్ఞానం, మతం, నైతికతకు సంబంధించిన అనేక ఆధ్యాత్మిక విషయాలను రహస్యాలను గరుడ పురాణం తెలియజేస్తుంది.
వీటిని పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు దరిచేరవు. గరుడ పురాణంలో చెప్పిన విషయాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు దరిచేయవు. ఒక్క పేదవాడికి కూడా సహాయం చేయకుండా ఉన్న వ్యక్తి యొక్క సంపద ఎప్పటికీ పెరగదు అని గరుడ పురాణం చెబుతోంది. అలాగే దానధర్మాలు లేదా ధర్మం చేయని వ్యక్తి సంపద కూడా అతని వద్ద శాశ్వతంగా ఉండదు. అలాంటి వారి సంపద త్వరలోనే క్షీణిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా అలాంటి వారిపై కోపించి ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడానికి లేదా దాతృత్వం, మతపరమైన పనులు చేయడానికి మన వంతు కృషి చేస్తే ఎల్లప్పుడూ మంచిది.
అలాగే మనకు ఉన్నంతలో లేని వారికి దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. మీరు డబ్బును సరైన సమయంలో లేదా సరైన స్థలంలో ఖర్చు చేయకపోతే, లేదా మీ డబ్బు మీ కుటుంబ జీవితంలో ప్రయోజనాలను లేదా సౌకర్యాలను అందించకపోతే, అలాంటి సంపద మీ వద్ద ఉన్నప్పటికీ వృథా అవుతుందీ. మనం ఖర్చు చేయాల్సిన సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలి. అలాంటి సమయంలో ఖర్చు చేయడానికి వెనబాటుతనాన్ని ప్రదర్శిస్తే అటువంటి సంపద మనకు ఉపయోగపడదు. మహిళల కంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు.
అలాంటి ఇళ్ల నుంచి ఎప్పటికైనా బయటకు రావాలని ఆమె భావిస్తుంది. ఆడ పిల్లలను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ముందు ఇంటి ఆడపడుచులను గౌరవించడం నేర్చుకోవాలి. ఇది ఇంటి ఆడపిల్లలను గౌరవించడం మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి అమ్మాయిని తోబుట్టువులా భావించి గౌరవించడం అని అర్థం చేసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం ఆడ పిల్లలను గౌరవించకుండా సంపాదించిన డబ్బు ఎప్పటికీ ఉపయోగపడదు. ఈ విషయాలన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. ఈ విషయాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.