Puja Vidhan : ఈ పుష్పాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది..!!

త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువును గురువారం ఏకాదశి తిథియానాన ప్రత్యేకంగా పూజిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Ashoka Flowers

Ashoka Flowers

త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువును గురువారం ఏకాదశి తిథియానాన ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. పూజలో విష్ణువుకు ఇష్టమైన వస్తువులను ఉపయోగించడం లేదా సమర్పించడం ద్వారా సంతోషిస్తాడు. శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఈ పుష్పాలను ఆయనకు సమర్పించండి.

చంపా పువ్వు:
చంపా పువ్వు విష్ణువు, కృష్ణ భగవానుడికి చాలా ఇష్టమైనది. గురువారాల్లో శ్రీహరికి చంపా పుష్పాలు సమర్పించి పూజిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కాబట్టి శ్రీహరికి పూజ చేసేటప్పుడు కనీసం ఒక్క చంపా పుష్పమైనా సమర్పించండి.

అశోక పుష్పాలు:
శ్రీమహావిష్ణువును అశోక పుష్పాలతో పూజించడం వల్ల ఆ వ్యక్తికి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

కదంబ పుష్పం:
కదంబ పుష్పాలు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి. శ్రీ హరికి కదంబ పుష్పాన్ని అర్పించే వ్యక్తికి మరణానంతరం యమరాజు పీడ తప్పుతుందని నమ్మకం. యమలోక బాధల నుండి, ఆ వ్యక్తి స్వర్గాన్ని పొందుతాడు.

ఎర్ర గులాబీ:
శ్రీహరి విష్ణువుతో పాటు, ఎర్ర గులాబీ పువ్వు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. విష్ణుమూర్తి చాలా త్వరగా ఎర్ర గులాబీతో సంతోషిస్తాడు.

shnu
విష్ణువు పూజలో పసుపు కమలంకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. పసుపు పువ్వులు, పసుపు పండ్లు, పసుపు బట్టలు విష్ణువుకి చాలా ఇష్టం. పసుపు కమలాన్ని నారాయణుడికి సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుంది

  Last Updated: 07 Oct 2022, 06:59 AM IST