Vastu: ఇంట్లో ఈ ఒక్క ఫొటో ఉంటే చాలు…అంతా శభమే…!!

  • Written By:
  • Publish Date - November 2, 2022 / 05:59 AM IST

సాధారణంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్న సామేత ఊరికే రాలేదు. ఏ ఇంట్లో అయితే శుభ్రతను పాటిస్తారో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మేదేవి నివసిస్తుందని అంటుంటారు. దీంతో కుటుంబ సభ్యులందరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా బాగుంటారు.

అయితే ఇల్లు ఆరోగ్యంగా అందంగా ఉండాలనుకుంటే ఇంట్లో ఈ ఆరు రకాల దేవుడి ఫోటోలు ఉండాల్సిందేనని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాటిని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పెట్టుకున్నట్లయితే చెడు ద్రుష్టి పోయి….మంచి అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుందట. అయితే ఆ ఆరు రకాల వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

పంచముఖి ఆంజనేయస్వామి ఫొటో ఇంట్లో ఉంటే అంతా శుభం జరుగుతుంది. ముఖ్యంగా నిలుచున్న ఆంజనేయ స్వామి ఫొటోను పెట్టుకోవాలి. కానీ ప్రత్యేకంగా పూజా గది ఉంటేనే పెట్టుకోవాలి. లేదంటే ఇంటి ప్రధాన ద్వారానికి పెట్టాలి. ఇలా చేస్తే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతి మంగళవారం పంచముఖి ఆంజేనేయస్వామి ఫొటోకు సింధూరం పెట్టి పూజ చేయాలి. అలా చేస్తే ఆ ఇంట్లో అద్రుష్టం వెంటనే ఉంటుంది. పాపాలను హరించి చిత్తశుద్ధిని ప్రసాదిస్తాడు ఆంజనేయస్వామి. తూర్పునకు అభిముఖంగా ఈ ఫొటోను ఉంచితే మంచిది. ఇక నరసింహస్వామి ఉత్తర ముఖంగా ఉంటే ఇంట్లో శత్రుబాధలు తొలిగిపోతాయి. లక్ష్మీ వరాహమూర్తి ఫొటోను ఉత్తరముఖంగా ఉంచితే గ్రహదోషాల నుంచి బయటపడవచ్చు. మహావీర గరుడస్వామి ఫొటోను ఇంట్లో పడమర ముఖంగా పెట్టడం వల్ల దుష్టప్రభావాలు తొలగిపోతాయి. శరీరంలో ఉండే విషపదార్థాల నుంచి రక్షిస్తాడు. ఊర్థ్యంగా ఉండే హయగ్రీవ స్వామిని ఇంట్లో ఉంచడం వల్ల సంతానం ప్రసాదిస్తాడు.