సోదరుడు సోదరీమణులు సంతోషంగా జరుపుకునే పండుగలు రక్షాబంధన్ పండుగ ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది హిందువులు ఈ రక్షాబంధన్ పండుగను సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రాఖీ పండుగ రోజున ఆడపిల్లలు అన్నయ్యకు లేదా తమ్ముళ్లకు రాఖీ కడుతూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 19 సోమవారం రోజు వచ్చింది. అయితే రక్షాబంధన్ రోజు చాలామంది ఎలా పడితే అలా ఏ సమయంలో పడితే ఆ సమయంలో రాఖీ కడుతూ ఉంటారు. కానీ అలా కట్టకూడదని ఒక నిర్ణీత సమయంలో మాత్రమే రాఖీని కట్టాలని చెబుతున్నారు.
ఈ సంవత్సరం ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్నం 1.29 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. అందుకే సూర్యోదయానికి ముందు రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. లేదంటే మధ్యాహ్నం 1.30 తర్వాత జరుపుకోవాలి. అప్పటి నుంచి ముహూర్తం రాత్రి 7 గంటల వరకు నిరంతరం ఉంటుంది. రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల మధ్య ఉంటుంది. అందుకే సాయంత్రం పూట రాఖీ కట్టడం శ్రేయస్కరం. నిజానికి రక్షా బంధన్ పండుగను జన్మాష్టమి వరకు జరుపుకుంటారు. కుటుంబానికి దూరంగా నివసించే వారు జన్మాష్టమి వరకు రాఖీ కట్టవచ్చు. అయితే రాఖీ ఎలా కట్టాలి? ఇది ఎప్పటి వరకు ఉంచుకోవాలి? అన్న వివరాల్లోకి వెళితే.. చాలా చోట్ల సోదరీమణులు కొబ్బరికాయకు తిలకం పెట్టిన తర్వాత రాఖీ కట్టి అనంతరం కల్వను కట్టి సోదరుడికి ఇస్తారు.
కొబ్బరికాయ లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు. అందుకే చాలా చోట్ల ఈ రోజున సోదర తిలకం, రాఖీ కట్టే ముందు సోదరీమణులు సోదరుడికి కొబ్బరికాయ లేదా చిప్పను నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత సోదరుడి తిలకం పెట్టి తర్వాత రాఖీ కట్టి హారతి చేస్తారు. దీని తరువాత సోదరుడు తన సోదరి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకొని సోదరికి బహుమతిగా ఇస్తాడు. రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ తప్పనిసరిగా చూసుకోవాలి. సోదరుడు తూర్పు ముఖంగా కూర్చుంటే సోదరి పడమర లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. పొద్దున రాఖీ కట్టించుకుని మధ్యాహ్నానికి తీసేయడం వంటివి చేయకూడదు. జన్మాష్టమి వరకు ఈ రాఖీ ఉంచుకోవాలి. పవిత్రమైన రోజు మాత్రమే దీన్ని చేతి నుంచి తీసేయాలని పండితులు చెబుతున్నారు.
కాబట్టి రక్షా బంధన్ నాడు రాఖీ కట్టిన తర్వాత కనీసం జన్మాష్టమి వరకు అయినా ఉంచుకోవాలట. రాఖీ నలుపు లేదా నీలం రంగులో ఉండకుండ చూసుకోవాలి. రాఖీ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి. దాని రక్షణ దారం పట్టుతో ఉండాలి. జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర ఉంచండి లేదా పారే నీటిలో వేయవచ్చు. రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు. ఒక వేళ చేతికి కట్టిన రాఖీ జన్మాష్టమి లోపే తెగిపోతే లేదా విరిగిపోతే దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజ గదిలో ఉంచుకోవాలి. లేదంటే నీటిలో విడిచిపెట్టాలని చెబుతున్నారు.