Hindu Death Rituals: శ్మశానంలోకి స్త్రీలు వెళ్ళకూడదా.. వెళితే ఏం జరుగుతుందో తెలుసా?

హిందువులు ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలను, సంస్కారాలను పాటిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా 16 సంస్కారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. పుట్ట

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 08:00 PM IST

హిందువులు ఎన్నో రకాల సంస్కృతి సంప్రదాయాలను, సంస్కారాలను పాటిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా 16 సంస్కారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. పుట్టుక నుంచి అంత్యక్రియల వరకూ జరిగే అతి ముఖ్యమైన సంస్కారాలు మొత్తం 16 అని చెబుతారు. వీటిలో ఆఖరి సంస్కారం అంత్యక్రియలు. మొదటి సంస్కారం నుంచి 15 సంస్కారాల వరకూ ప్రతిదాంట్లోనూ స్త్రీలు ప్రత్యక్షంగా ఉండి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ అంత్యక్రియలకు సాధారణంగా శ్మశాన వాటికకు పురుషులే వెళతారు. స్త్రీలను అనుమతించరు. అయితే స్త్రీలను స్మశానంలోకి అనుమతించకపోవడం అన్నది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది.

అలా కూడా ఎందుకు జరుగుతుంది? స్త్రీలు స్మశానంలోకి వెళితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ మధ్యకాలంలో పురుషులతో పాటూ స్త్రీలు కూడా శ్మశానాలకు వెళుతున్నారు. కొడుకులు లేని తల్లిదండ్రులకు ఆడపిల్లలే దహన సంస్కారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. పురుషుల కన్నా స్త్రీల మనస్సు సున్నితమైనది. బాధని పురుషుడు గుండెల్లో దాచుకుంటే స్త్రీలు ఏడుపు రూపంలో బయటకు వ్యక్తం చేస్తారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు గుండెపగిలేలా ఏడుస్తుంటారు. అయితే శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన తర్వాత కూడా మహిళలు వచ్చి అక్కడ రోదిస్తే ఆత్మకు శాంతి కలగదట.

ఆ ఏడుపు విని ఆత్మలు కూడా రోదిస్తాయట. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల చితిని తగులబెట్టినప్పుడు ఎముకలు నలిపే శబ్దం వస్తుంది. ఈ శబ్దాలకు మహిళలు, పిల్లలు భయపడతారని అంటారు. అలాగే హిందూ విశ్వాసాల ప్రకారం కుటుంబంలోని పురుషులు ఇంట్లోని వారు చనిపోయినప్పుడు, కర్మలు చేసినప్పుడు గుండు చేయించుకుంటారు. చేయించుకోవాలి కూడా. అయితే స్త్రీలు ఈ నియమం పాటించలేరు. అంత్యక్రియలు మహిళలు చేయకూడదని చెప్పడం వెనుక ఇది కూడా ఒక కారణం అంటారు శ్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిగిన తర్వాత కూడా కొన్ని ఆత్మలకు శాంతి లభించదని, అవి తిరుగుతూనే ఉంటాయని చెబుతారు.

అలాంటి ఆత్మలు స్త్రీల శరీరంలోకి సులువుగా ప్రవేశిస్తాయట. అందుకే స్త్రీలను శ్మశానంలోకి అనుమతించరు. అంత్యక్రియల సమయంలో ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్లను దహనసంస్కారాలకు తీసుకెళ్లాక ఆ ఇల్లు ఆ ఖాళీగా ఉండకూడదు. శ్మశానవాటికకు వెళ్లిన పురుషులు తిరిగి వచ్చాక స్నానమాచరించి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పటి వరకూ మహిళలు ఇంట్లోనే ఉండాలి. ఆ సమయంలో ఇల్లు ఖాళీగా ఉంటే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశిస్తాయి.