Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇష్టమైన 6 రకాల పువ్వులు.. వీటితో పూజిస్తే అమ్మ తిష్ట వేసుకుని కూర్చోవాల్సిందే!

Lakshmi Devi

Lakshmi Devi

ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది. అలాగే ఇంట్లోని వారికీ కూడా అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఐశ్వర్య వంతులు అవుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మికత పురోగతిని కూడా ప్రసాదించే దేవత కూడా, సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందట.

లక్ష్మికి ఆరు రకాల పువ్వులు అంటే చాలాఇష్టమని ఆ పువ్వులతో పూజిస్తే అమ్మవారు ఇల్లు వదిలి వెళ్లిపోవడం ఖాయం అని చెబుతున్నారు. మరి లక్ష్మికి ఇష్టమైన ఆ రకాల పువ్వులు ఏవి అన్న విషయానికి వస్తే.. అందులో మొదటిది తామర పువ్వు. ఈ పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై దర్శనం ఇస్తుంది. బురదలో వికసించే తామర పువ్వు ఎంతో పవిత్రమైనది. అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. తామర పువ్వును సమర్పించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగుతాయట. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుందట. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుందట. అలాగే మల్లె పువ్వులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సువాసన భరితమైన పువ్వులంటే ఆ అమ్మకు ఎంతో ప్రీతికరం. తెలుపు రంగు స్వచ్ఛతను, శాంతిని సూచిస్తుందట.

మల్లెపువ్వులను సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుందట. గులాబీ పువ్వులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమ్మ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉంచితే సంతోషిస్తుందట. ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని మరొక వైపు ప్రేమను కూడా సూచిస్తాయట. ఎవరికైనా డబ్బులు ఇచ్చి అవి తిరిగి రాకుండా ఇబ్బందులు పడేవారు ఎరుపు గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బులు తిరిగి వస్తాయట. అలాగే బంతిపువ్వులు అంటే కూడా లక్ష్మికి చాలా ఇష్టం. ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉండాలన్నా, దుష్టశక్తులు పారిపోవాలన్నా, విద్యార్థులు చదువులో రాణించాలన్నా లక్ష్మీదేవికి బంతిపువ్వులతో పూజ చేయాలని చెబుతున్నారు.

మొగలిపువ్వు దాని వాసనకు చాలా ప్రసిద్ధి. ఇది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టం. మొగలి పువ్వును లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నురాలు అవుతుందట. ఎరుపు రంగు మందారం పువ్వు శక్తికి, శ్రేయస్సుకు, అదృష్టానికి చిహ్నం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. లక్ష్మీ పూజలో మందారం పువ్వులు సమర్పిస్తే దేవత త్వరగా ప్రసన్నం అవుతుందట. భక్తులకు, సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతిని ప్రసాదిస్తుందట. నిలిచిపోయిన పనులు పూర్తీ అవుతాయట. పూజలో తాజాగా ఉన్న పువ్వులు, సువాసన గల పువ్వులను మాత్రమే సమర్పించాలి. పువ్వులను అమ్మవారికి సమర్పించే ముందు గంగాజలంతో శుద్ది చేయాలని చెబుతున్నారు. ఏ దేవతకైనా ఏ పువ్వును అయినా సమర్పించే ముందు ఆ దైవ నామం జపిస్తూ పువ్వులు సమర్పించాలని చెబుతున్నారు.