Ganesh Chaturthi: బొజ్జ గణపయ్య విగ్రహ ప్రతిష్టాపన పద్ధతి.. ముహూర్తం.. ఇతర జాగ్రత్తలివీ

ఆగష్టు 31వ తేదీన వినాయక చవితి పండుగ వస్తోంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు.

  • Written By:
  • Publish Date - August 27, 2022 / 07:00 AM IST

ఆగష్టు 31వ తేదీన వినాయక చవితి పండుగ వస్తోంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు.

మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ వేడుక చాలా ఘనంగా నిర్వహిస్తారు.

ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు ఏకదంతుడిని స్మరించుకుంటారు. ఆ తర్వాతే ప్రారంభిస్తారు.

ఆగష్టు 31వ తేదీన దేవాలయాల నుంచి ప్రతి ఇంట్లో బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తారు. మొత్తం 10 రోజుల పాటు భక్తుల నుంచి పూజలందుకుంటాడు గణపయ్య. గణపతి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పద్ధతుల్లో జరుగుతుంది. ఏ పద్దతిలో జరుగుతుంది.. ఎలాంటి ముహూర్తంలో గణపయ్యను ప్రతిష్టిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

* అనుకూల సమయం : 2022 ఆగస్టు 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:34 గంటలకు చతుర్థి ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు.

* గణేష్ చతుర్థి ముగింపు తేదీ: 31 ఆగస్టు బుధవారం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాలకు చతుర్థి ముగుస్తుంది.

* గణపతి ప్రతిష్టాపన ముహూర్తం: ఆగస్టు 31 బుధవారం, ఉదయం 11 గంటల 5 నిమిషాలకు మరియు సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 01:38 నిమిషాల వరకు అనుకూలంగా ఉంది.

విగ్రహం ఏర్పాటు క్రమంలో..

* ముందుగా విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని నీళ్లతో శుద్ధి చేయాలి
* ఆ తర్వాత ఎర్రటి తివాచీ పరచి అక్షత్ ఉంచాలి
* దీనిపై విగ్రహాన్ని ప్రతిష్టించాలి
* ఆ తర్వాత వినాయకుడిపై గంగా జలం చల్లాలి
* విగ్రహాన్ని ప్రతిష్టించేముందు , ఆ విగ్రహానికి ఇరువైపులా ఒక తమలపాకును ఉంచాలనే విషయాన్ని మరువకూడదు.
* గణపతి విగ్రహానికి కుడి వైపున నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి
* చేతిలో అక్షతలు మరియు పుష్పాలతో భగవంతుని ధ్యానించాలి
* ఓం గన్ గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి.