హిందూ మతంలో తులసి మొక్కను పవిత్రంగా బావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాగా తులసి మొక్కను పవిత్రంగా భావించడంతో పాటు పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లోనూ తులసి మొక్క ఉంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం క్రమంలో తప్పకుండా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం మనకు లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా తులసి ఆకులతో కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఆ సమస్యల నుండి విముక్తి పొందటానికి తులసి ఆకులతో ఈ పరిహారం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయట. ఆర్థిక సమస్యల నుండి విముక్తి 11 తులసి ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి కొంత సమయం ఎండలో ఆరబెట్టాలట. ఆ తర్వాత సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలట. ఆ ఆకులన్నింటితో ఒక మాల తయారు చేసి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలట. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయట. అలాగే తులసి ఆకులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజగదిలో ఉంచి వాటి మీద కొంచెం కుంకుమ పసుపు వేసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలట.
పూజ అయిపోయిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ముడి వేసి మీ పర్సు లేదా డబ్బులు ఉంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే కొందరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయట. అలాంటి సమయంలో నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేయాలట. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తితో పోయి సానుకూల శక్తి పెరుగుతుందట. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద, ఇతర ప్రదేశాల్లో తులసి ఆకులతో చల్లుకోవాలని చెబుతున్నారు.