చైత్ర నవరాత్రి చివరి రోజు శ్రీరామునికి అంకితం చేయబడింది. ఆ రోజున (మార్చి 30) శ్రీ రామ నవమి (Sri Rama Navami) జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున పుష్య నక్షత్రంలో పూర్ణిమ రోజున శ్రీ రాముడు అవతరించినందున.. శ్రీరాముని భక్తులు సాధారణంగా ఈ కార్యక్రమానికి చాలా రోజుల ముందు నుంచే సన్నాహాలు చేస్తారు. భగవంతుడు రాముని ప్రస్తావన భక్తులకు అతని అనంతమైన సద్గుణాలను గుర్తుకు తెచ్చేటట్లు చేస్తుంది. మరికొందరు శ్రీరాముడి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి పులకించిపోతారు. ఏ రామ భక్తుడికైనా ఇది చాలా ప్రత్యేకమైన రోజు. రామ నవమి రోజున ఎలాంటి కార్యకలాపాలు సూచించబడ్డాయి.. ఆ రోజున ఏయే కార్యకలాపాలు నిషేధించ బడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓం శ్రీ రామయ: నమ:
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
ఓం దశరథయే విద్మహే సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్
అనే స్త్రోత్రాలు చదివి రాముని కృపకు పాత్రులు కాగలరని పురాణాలు చెబుతున్నాయి.
అయోధ్యకు రాజు దశరథుడికి ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాధ అంతా సంతానం గురించే. వశిష్ట మహాముని దశరథ రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్నినిర్వహించే బాధ్యతను అప్పజెప్పాలని కోరాడు. దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి రోజున.. మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మను ఇచ్చింది. కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. అందుకే చైత్ర మాసం తొమ్మిదో రోజున శ్రీ రామ నవమి (Sri Rama Navami) జరుపుకుంటారు.
Also Read: Shakti Ganapati: ఈ ఆలయానికి వెళ్లాలనుకుంటే స్వామి పిలిస్తేనే వెళ్లగలరు