TTD: టీటీడీకి రెండు ఖరీదైన బస్సులు విరాళం

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

  • Written By:
  • Publish Date - December 1, 2023 / 08:14 PM IST

TTD: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దర్శనం కోసం ఎంతోమంది బారులు తీరుతారు. ఇక ఆయనకు కానుకలు సమర్పించేందుకు సైతం పోటీ పోడుతుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణ, వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సులను అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డీఐ జానకిరామరెడ్డి పాల్గన్నారు.తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 5 కంపార్ట్‌మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.