Arunachalam : తమిళనాడు(Tamil Nadu)లో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం(Arunachalam). దీన్ని తమిళులు.. తిరువణ్ణామలై(Tiruvannamalai) అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి(Lord Shiva) దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతకీ.. ‘గిరి ప్రదక్షిణ’ ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఏడాది అనుకూలమైన రోజులేవి? ఎలా చేరుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join.
పౌర్ణమి రోజుల్లో అరుణాచ గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని, కోరిక కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. చంద్రుడు ఆ రోజు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట. కాబట్టి, ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే.. మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
కాగా, తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది. బెంగళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.