మన చుట్టూ ఉండే వారిలో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎంత డబ్బు సంపాదించినా సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని, చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ అప్పుల సమస్యలు తీరిపోవడానికి ఎన్నెన్నో పరిహారాలు పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు ప్రతి అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే అప్పులు తప్పకుండా తీరిపోతాయని చెబుతున్నారు పండితులు. మరి అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. కాగా ప్రతి ఒక్కరికి ఒక జన్మ నక్షత్రం ఉంటుంది. ఈ జన్మ నక్షత్రాలతో కొన్ని రోజులు వస్తాయి.
అలా మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోవాలి. తరువాత అమావాస్య రోజున ఉదయమే నిద్ర లేచి,కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని పూజకు సిద్ధంగా ఉండాలి. ఆ రోజున తయారు చేయించనటువంటి మామిడి చెక్కకు పసుపు రాయాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీ దేవి అమ్మవారి ఫోటో లైదంటే విగ్రహం పెట్టాలి. తర్వాత ఇత్తడి లేదా వెండి చెంబు కంకణం కట్టి కలశంగా చేసి అందులో నీళ్లు పోసి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పచ్చ కర్పూరం వేయాలి. ఆపై చెంబులో మామిడాకులు పెట్టి కొబ్బరికాయ పెడితే కలశం స్థాపన అవుతుంది.
ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి 108 ఎర్ర గులాబీలు లేదంటే 108 తామర పువ్వులు సమర్పించాలి. ఇక నైవేద్యంగా ఏదైనా తీయని ప్రసాదాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రి కూడా దీపారాధన చేసుకొని, ధూప, దీప, నైవేద్యాలు చెల్లించుకోవాలి. తరువాత చంద్రుడిని దర్శనం చేసుకొని నేలపైన పడుకోవాలి. పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకొని పడుకోవాలి. మరుసటి రోజు ఉదయమే లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని పూజా గదిలోకి వెళ్లి అక్కడు ఉన్న కళశంలోని నీటిని ఒక బాటిల్లో పోసుకోవాలి.
పూజకు సంబంధించిన పువ్వులు, కర్పూరం, అగరబత్తీలు ఉపయోగించినవి ఏవైతే ఉన్నాయో, వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో కట్టివేసి ఏదైనా నదిలో వేయాలి. కళశం నీరు పోసుకున్న బాటిల్కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయాలి. ఇలా ప్రతీ అమావాస్యకు చేసుకుంటూ ఉండాలి. బాటిల్లో ఉన్న కళశపు నీటిని మొక్కలకు పోయాలి. ప్రతీ అమావాస్యకు ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం చేసిన అప్పులు క్రమంగా తీరిపోవడం జరుగుతుంది. మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇలా ఆర్థిక సమస్యలు ఉన్నవారు జన్మ నక్షత్రం ప్రకారం ఈ విధంగా అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల క్రమంగా అప్పులు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు.