హిందూ సంప్రదాయం ప్రకారం ఆడ పిల్లలు పెళ్లి అయినా తర్వాత కొన్ని రకాల అలవాట్లు చేసుకోవాలట. ధరించే ఆభరణాలు ప్రతీ ఒక్కటీ కూడా మారిపోతాయి. పెళ్లి తర్వాత స్త్రీలకు మెడలో మాంగల్యంతో పాటు కాలికి మెట్టెలు నుదుటిన సింధూరం, చేతికి గాజులు వంటివి తప్పనిసరిగా ధరిస్తూ నిండు ముత్తైదువుగా ఉంటారు. అయితే కాలికి మెట్టెలు ధరించే స్త్రీలు మెట్టలు ధరించే విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని,పొరపాటున కూడా కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
అయితే స్త్రీలు మెట్టెలు ధరించేటప్పుడు ఎలాంటి తప్పులను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి జరిగే సమయంలో తన మేనమామ కాలికి మెట్టెలు తొడుగుతారు. ఈ మెట్టెలు ధరించే తప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలట. వివాహిత పెళ్లి తర్వాత ధరించే మెట్టెలు చంద్రుని సూచిస్తాయట. కాబట్టి ఎప్పుడూ కూడా కాలికి రెండవ వేలిలో మెట్టెలు ధరించాలట. అయితే ఈ మెట్టెలు పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదని, అలాగే వాటిని తీసి పక్కన పెట్టి పని మీద బయటకు వెళ్లేటప్పుడు పక్కన పెడుతుంటారు. కానీ ఇలా అసలు పెట్టకూడదని చెబుతున్నారు. పెళ్లయిన వారు వెండి మెట్టలను మాత్రమే కాలికి ధరించాలట.
చాలామంది ధనవంతులు బంగారు మెట్టలను ధరిస్తారు ఇలా బంగారు మెట్టెలు కాలికి ధరించడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుందట. బంగారులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. అలాంటి లక్ష్మీదేవిని కాలు మెట్టెలుగా ధరించడం వల్ల అమ్మవారిని అవమానించినట్టేనని అవుతుందని చెబుతున్నారు. అందుకే మెట్టెలు ఎప్పుడూ కూడా వెండివే ధరించాల్సి ఉంటుందట. బంగారు మెట్టెలను ధరించకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఎప్పుడూ కూడా ఖాళీలో పెళ్లి అయిన స్త్రీలు మెట్టెలు లేకుండా ఉండకూడదట.