Cash: ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడం కోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా నిద్ర మానేసి తిండి

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 06:00 AM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడం కోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా నిద్ర మానేసి తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నారు. అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో మిగలడం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది మదన పడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితులు ఎదురుకోవడానికి ఒక రకంగా వాస్తు దోషాలు కూడా కారణం అవ్వచ్చు.

చాలామంది ఈ విషయం నమ్మకపోయినా ఇదే నిజం. అయితే వాస్తు దోషాలు ఇల్లు, కార్యాలయాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాస్తు నియమాలు పాటించకపోతే మనిషిపై మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా ప్రభావం పడుతుంది. అందుకే వాస్తు నియమాలను తప్పకుండ పాటించాలీ.. డబ్బు సంపాదించడంతోపాటు వాస్తు విషయాలను కూడా పాటించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. వాస్తు శాస్త్ర నియమాలను పాటించకపోతే ఆర్ధిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు దోషాలు మాత్రమే కాదు గ్రహచార సంచార దోషాలు కూడా మనిషిని ఆర్ధికంగా దెబ్బతీస్తాయి.. మరి అటువంటప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంట్లో పనికిరాని వస్తువులను ఉపయోగించని వస్తువులను అమావాస్య రోజు బయటకు పారేయడం అమ్మడం లాంటివి చేయడం మంచిది. పడుకునేటప్పుడు దర్వాజా వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అలాగే ఇంట్లో ఉండే సాలెగూళ్ళను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి. బూజు ఎక్కడ ఉండకుండా ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండ తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లోకీ లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది. అలాగే తులసి చెట్టు దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.