Pooja: తులసి మొక్క, పూజా మందిరం.. ఈ రెండింటిలో మొదటి పూజ ఎక్కడ చేయాలో మీకు తెలుసా?

సాధారణంగా పూజ చేసే వారికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు కూడా ఉంటా

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 04:30 PM IST

సాధారణంగా పూజ చేసే వారికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీపారాధన విషయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు కూడా ఉంటాయి. అటువంటి వాటిలో మొదటి పూజా ఎక్కడ చేయాలి అన్న సందేహం కూడా ఒకటి. అంటే మొదటి పూజ దేవుడి మందిరంలో చెయ్యాలా? లేదంటే కలసి మొక్క దగ్గర చేయాలా అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. అలాగే మొదటి దీపం గడప దగ్గర వెలిగించాలా, లేదంటే మన పూజా మందిరంలోని దేవుని దగ్గర వెలిగించాలా అన్న ఈ సందేహాలకు సరైన సమాధానం తెలియక అనేకమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మీరు చేసిన ఫలితం దక్కకపోగా దేవుళ్ళ ఆగ్రహానికి లోనవుతూ ఉంటారు.

మాములు రోజులతో పోల్చుకుంటే కార్తీకమాసంలో దీపానికి దీపారాధనకి, దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో దీపోత్సవం చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దీపాలకి పాపాలను ప్రక్షాళన చేసేటువంటి శక్తి ఉంటుంది అని అర్థం. అంతేకాకుండా మన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా దీపం చేస్తుంది. కేవలం సానుకూల శక్తిని మామూలు వేదులతో ప్రవహింప చేసేలా చేస్తుంది. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు చాలామంది అనేక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీకు ఎంత స్థాయి స్తోమత కలిగి ఉన్నా లేకపోయినా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయటం అనేది చాలా గొప్ప విషయం. దీపారాధన మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే చేయాలి. అయితే దీపారాధన ఎవరు చేయాలి అన్న విషయానికి వస్తే..

సాధారణంగా ఇంట్లో విధానాలని ఇంట్లో స్త్రీలు పాటిస్తూ ఉంటారు. వాస్తవానికైతే ఇంటి యజమాని ఇంటికి పెద్దదైనటువంటి పురుషుడు పూజా విధానం నిత్యం పాటించాలట. స్త్రీ పురుషుడు ఎవరైనా సరే దీపారాధన కానీ నిత్య పూజలు కాని చేయవచ్చు. ఇక దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు బట్టల్లో దీపారాధన చేస్తే మేలు చేస్తుంది అంటారు. ఇక ఎలాంటి ఒత్తులు వాడాలి. జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం కలుగుతుంది అంటారు. దుష్ట బాధల నుండి విముక్తి లభిస్తుంది అంటారు ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక దీపారాధన చేసే సమయం చాలా ముఖ్యమైనది సూర్యోదయ సమయంలో మాత్రమే దీపారాధన చేయాలి. అంటే ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ తర్వాత సూర్యాస్తమయం తరువాత అంటే సందెవేళలో చీకటి పడ్డాకే దీపాన్ని వెలిగించాలి. అప్పుడే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. ఇక మొదటి పూజ ఎక్కడ చేయాలి.

తులసిని నిత్యం ఆరాధించాలి. ఇక మొదట పూజని తులసి మాత దగ్గర చేయాలా.. లేక మన పూజా మందిరంలో చేయాలనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. తులసి మాత దగ్గర దీపాన్ని పెట్టిన తర్వాత మీరు మీ పూజ గదిలో పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నిత్యం పూజని ఆరాధించే ప్రతి ఒక్కరూ మొదటగా మీరు మీ ఇంటి తులసమ్మకి పూజ చెయ్యాలి. ఆ తర్వాత మీ సింహద్వారాన్ని అలంకరించుకొని పూజ చేయాలి. ఆ తర్వాత మీ ఇంట్లో మీ ఆరాధ్య దైవాన్ని ఆరాధించాలి. మన సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించిన తర్వాత మన పూజ గదిలో భగవంతుని ఆరాధించాలి.