ధర్మ ప్రచారంలో భాగంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిజీ వారు హైదరాబాద్ నగరానికి విచ్చేసారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా ఆయన దర్శనం కోసం భక్తులు, పండితులు, సన్యాసులు విస్తారంగా తరలివచ్చారు. నల్లకుంట శంకర మఠంలో స్వామిజీకి ప్రత్యేక స్వాగతం పలికారు. పీఠాధిపతి సన్నిధిలో వేదపండితులు వేదపారాయణాలు, హోమాలు జపించారు. స్వామిజీ ఆశీస్సులను సీఎం రేవంత్ తో పాటు ప్రముఖులు, రాష్ట్ర నాయకులు పొందారు. ఆయన సందేశంలో ధర్మం అనేది కేవలం ప్రార్థనలో మాత్రమే కాకుండా, ప్రతి మనుసులో, ప్రతి మనిషి ప్రవర్తనలో ప్రతిబింబించాలన్నారు.
Bus fire Accident : మరో ప్రైవేట్ బస్సు దగ్ధం
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నల్లకుంట శంకర మఠాన్ని సందర్శించి, జగద్గురువుల ఆశీర్వాదం పొందారు. ఆయన వేములవాడ ఆలయ అభివృద్ధికి సంబంధించి జరుగుతున్న పనుల వివరాలను స్వామిజీకి వివరిస్తూ భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వేములవాడ ఆలయం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రబిందువని, దానిని మరింత వైభవంగా తీర్చిదిద్దడానికి కృషి కొనసాగుతోందని తెలియజేశారు. స్వామిజీ ఈ సందర్భంలో వేములవాడను భక్తి, భవన, పరంపరల పుణ్యక్షేత్రంగా వర్ణించి, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీస్సులు అందించారు.
శృంగేరి పీఠం నుండి వచ్చే జగద్గురువుల పర్యటనలు కేవలం ఆధ్యాత్మిక ప్రేరణకే కాకుండా, భారతీయ సాంప్రదాయం మరియు సనాతన విలువల పునరుద్ధరణకు కూడా ప్రతీకగా మారుతున్నాయి. ఈ యాత్ర ద్వారా ధర్మం, జ్ఞానం, సేవ అనే మూడు మార్గాలను ప్రజల్లో చైతన్యపరచడమే లక్ష్యమని స్వామిజీ తెలిపారు. ప్రస్తుతం భౌతిక పురోగతిలో మనసు నిశ్చలతను కోల్పోకుండా, ఆధ్యాత్మికతను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలనే ఆవశ్యకతను ఆయన పునరుద్ఘాటించారు. నల్లకుంట శంకర మఠ సందర్శనతో హైదరాబాద్ నగరంలో భక్తి వాతావరణం నెలకొంది.
“ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారిని హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో సందర్శించాను.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామివారికి వివరించాను.#VemulawadaTemple pic.twitter.com/foyYh5rVCE— Revanth Reddy (@revanth_anumula) October 28, 2025
