Chaya Someswara Temple Mystery: ఛాయా సోమేశ్వరాలయం.. ఇదో మిస్టరీ టెంపుల్..!

ఛాయా సోమేశ్వరాలయం.. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - October 15, 2022 / 10:48 AM IST

ఛాయా సోమేశ్వరాలయం.. ఇదో మిస్టరీ టెంపుల్. ఈ ఆలయం గర్బగుడి ముఖద్వారం ముందు రెండు స్తంబాలున్నా.. అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. భారతీయ వాస్తు శాస్త్రం గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం నల్లగొండలోని పానగల్లులో ఉంది. సుమారు 800 ఏళ్ల కిందట కందూరు చాళుక్య ప్రభువైన ఉదయ భానుడనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం.

ఈ ఆలయం త్రికూటాలయంగా మూడు గర్బాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం పడమర దిక్కున ఉన్న గర్బగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఇది వెలుతురు ఉన్నంత సేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా ‘నీడ’ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ, ఈ నీడ సూర్యుడి వెలుతురుతో పనిలేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది.

ఛాయా సోమేశ్వరాలయాన్ని త్రికూటాలయం అంటారు. ఈ ఆలయంలో మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఆలయంలోని రెండు స్తంబాల్లో ఒకదాని నీడై ఉండొచ్చని భావించినా.. ఒకే నీడ రెండు స్తంబాలకు మధ్యలో ఉండే గర్బగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనిదనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఆ ఆలయంలోని మూడు గర్బ గుడులు కూడా ఒకేరీతిగా ఉంటాయి.