Bhadrachalam: భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఇలా బుక్ చేసుకోండి

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 11:32 PM IST

Bhadrachalam: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా, ఈ నెల 17న రామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా ఇంటికే అందించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలు బుక్ చేసుకోవాలని సజ్జనార్ తెలిపారు. అలాగే, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే వారు 040 – 23450033, 040 – 690000, 040 – 694400669 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

తలంబ్రాల బుకింగ్ ఇలా
రాములోరి కల్యాణ తలంబ్రాల బుకింగ్ ను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం సైట్ లో అందుబాటులో ఉంచారు. తొలుత https://www.tsrtclogistics.in కు వెళ్లి.. తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత మీ చిరునామా, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత తలంబ్రాలు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఎంచుకోవాలి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151గా నిర్ణయించారు.
అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూపీఐ ద్వారా పేమెంట్ చెయ్యొచ్చు.
పేమెంట్ చెల్లించిన తర్వాత బుకింగ్ సక్సెస్ అయినట్లు ఓ ట్రాన్సాక్షన్ నెంబర్ తో ఆర్టీసీ నుంచి ఓ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ చిరునామాకు కల్యాణ తలంబ్రాలు వస్తాయి.
అటు, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ల నెంబర్లైన 040 – 23450033, 040 – 690000, 040 – 694400669ను సంప్రదించి వివరాలు తెలపాలి.