Site icon HashtagU Telugu

Spirituality: మీ ఇంట్లో ఇవి పాటిస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహంతో కోటీశ్వరుడు అవ్వడం ఖాయం!

Lakshmi Devi

Lakshmi Devi

డబ్బు అన్నది ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా అవసరం. మరి ముఖ్యంగా ప్రస్తుతం రోజుల్లో డబ్బులు లేకుండా ఎలాంటి పనులు జరగడం లేదు. ఒక్క లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది? లక్ష్మీదేవిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి? అన్న విషయానికి వస్తే.. బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే డబ్బు నిలుస్తుందిట. బిర్యానీ ఆకు పరిహారం చేయడానికి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యాని ఆకుని పెట్టి పూజ చేయాలట. అయితే వంటింట్లో ఉండే బిర్యాని ఆకును కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉన్న బిర్యానీ ఆకుని తీసుకుని మాత్రమే పూజ చేయాలని, పూజ అయిపోయిన తరువాత ఆ బిర్యానీ ఆకును మీ జేబుులో లేదా పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

మనలో చాలా మందికి ఇంటి స్థలం వున్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బు వుండదు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొన ఇంటి ఈశాన్య దిశలో వుంచాలి. ఇలా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందట. అలాగే ఇల్లు త్వరగా కట్టుకునేందుకు వీలు పడుతుందని చెబుతున్నారు. చాలామంది బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుంటే ఎప్పుడూ కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి కాళ్లు కడుక్కొని మాత్రమే రమ్మనాలి. తులసి మొక్కను పూజించడం వల్ల కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవే నివసిస్తుంది.

5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డులో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్. మీరు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్టు మీకు అనిపిస్తే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలట. ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఉండవట. ప్రతిరోజు పూజ చేయకపోయినా సోమవారం రోజు పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. దేవతలందరూ ఆరాధించేది కూడా శివుడినే. కాబట్టి సోమవారం శివుడికి పూజచేస్తే దేవతలందరి ఆశీస్సులను అందుకుంటారట. అప్పుల బాధలు తీరాలనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే తమ అప్పుల బాధలు తీరిపోతాయట. శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తరువాత ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పూసి దానిపైన 2 లవంగాలను కూడా వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి.

తరువాత శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి, లేదా వాటర్ సింక్లో పడేయాలి. ఇలా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి వుండవట. చాలా మంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తారు. ఇలా భోజనం చేయడం వల్ల ఇంట్లో వున్న డబ్బు మొత్తం కరిగిపోతుందట. ఆర్థిక సమస్యలు పెరుగుతాయట. కాబట్టి ఇప్పటి నుంచైనా మంచం పైన కూర్చొని భోజనం చేయడాన్ని చేయవద్దు. వాస్తు ప్రకారం భోజనం చేసేటప్పుడు ఉత్తర ముఖంగా కూర్చొని చేయాలి. అలా చేయడం వల్ల ఆదాయం బాగా పెరుగుతుందట. లక్ష్మీ దేవికి ఎర్రగురలాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర గులాబీ రేకలను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. డబ్బును లెక్కపెట్టేటప్పుడు నోటి ఊమును ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందట.