మామూలుగా మనం పడుకున్నప్పుడు అనేక రకాల కలలు రావడం అనేది సహజం. కొన్ని కొన్ని సార్లు మంచి కలలు వస్తే మరి కొన్నిసార్లు చెడ్డ పిల్లలు వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం మనకు వచ్చే ప్రతి ఒక కలకు కూడా ఒక్కొక్క అర్థం ఉంటుందని చెబుతున్నారు. ఇకపోతే చాలామందికి అప్పుడప్పుడు లేదంటే తరచూ ఇంట్లో చనిపోయిన వారు మనకు బాగా సన్నిహితంగా ఉండేవారు చనిపోతే వారికి సంబంధించిన జ్ఞాపకాలు వారితో గడిపిన క్షణాలు తరచూ కలలో వస్తూ ఉంటాయి. ఈ విధంగా పదేపదే చనిపోయిన వ్యక్తులు కలలోకి వస్తున్నారు అంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు.
చనిపోయిన వాళ్లు పదే పదే కలలోకి వస్తే కాల సర్ప దోషం ఉందని అర్థమట. కాల సర్ప దోషానికి నివారణ చేయకపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ కాల సర్ప దోషం అంటే ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.. కాలసర్ప దోషం అంటే ఒక వ్యక్తి జీవితంలో చాయాగ్రహాలుగా పిలవబడే రాహువు కేతువులో ఒకదానికొకటి ముఖాముఖిగా వచ్చినప్పుడు అన్ని గ్రహాలు లోపలికి వచ్చే విధంగా ఉన్నప్పుడు సంభవించే ఆ అశుభకరమైన జ్యోతిష్య పరిస్థితిని కాలసర్భదోషం అంటారు. అప్పుడు రాహువు , కేతువుల మధ్య, అటువంటి యోగం ఏర్పడుతుంది, దీనిని కాల సర్ప దోషం అంటారు.
ఒక వ్యక్తి తన కుండలిలో ఈ లోపం కలిగి ఉంటే, అతను జీవితంలో సమస్యలు రావడం మొదలౌతుంది. అతని కెరీర్ హెచ్చుతగ్గులు మొదలవుతుంది, వ్యాపారం నష్టాలను ఎదుర్కోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, మీ సంబంధాలు క్షీణించడం ప్రారంభిస్తాయి. మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మొత్తంమీద, కాల సర్ప దోషం కెరీర్, సంబంధాలు, ఆరోగ్యం , మానసిక శ్రేయస్సుతో సహా జీవితంలోని వివిధ అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే కలలో చనిపోయిన వ్యక్తులు పదేపదే కనిపించడం కాల సర్ప దోషం ఫలితంగా ఉంటుందా? అంటే మీ కలలో మీ పూర్వీకులు లేదా చనిపోయిన వ్యక్తులు పదేపదే కనిపిస్తే, మీ జాతకంలో కాల సర్ప దోషం ఉన్నట్లు జ్యోతిష్యశాస్త్రంలో నమ్ముతారు. చాలా సార్లు మీ పూర్వీకులు కలల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తారు.
తద్వారా మీరు సమస్యల నుండి బయటపడటానికి అవకాశం పొందుతారు. మీ జాతకంలో కాలసర్ప దోషం ఉన్నట్లయితే, మీరు నిద్రపోతున్నప్పుడు ఊపిరాడకుండా ఉండవచ్చు. అటువంటి సంకేతాలు కనిపిస్తే, మీరు అప్రమత్తంగా ఉండాలి , దానిని వదిలించుకోవడానికి చర్యలు తీసుకోవాలి. మరి ఈ కాలసర్ప దోషాన్ని తొలగించుకోవడానికి ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే ప్రతి శనివారం శని దేవుని ఆలయంలో ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయాలి. అన్నదానం వస్త్ర దానం లాంటి దానాలు చేయడం మంచిది.