Site icon HashtagU Telugu

Akshaya Tritiya: మీ సంపద మరింత పెరగాలి అంటే అక్షయ తృతీయ రోజు ఈ విధంగా చేయాల్సిందే!

Akshaya Tritiya

Akshaya Tritiya

అక్షయ తృతీయ పండుగను హిందువులు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఏడాది అనగా 2025 లో అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోనున్నారు. హిందూ ధర్మంలో దీనిని చాలా అద్భుతమైన ముహూర్తంగా భావిస్తారు. అయితే అక్షయ తృతీయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. ఈ రోజున బంగారం కొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజున బంగారం కాకుండా ఏం చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మరి సంపద పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అక్షయ తృతీయ హిందూ ధార్మికంగా ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే దానాలు, పుణ్య కార్యాలు ఎప్పటికీ అక్షయంగా ఫలిస్తాయని విశ్వాసం ఉంది. అక్షయ తృతీయ రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి తన భక్తులతో సంతోషిస్తే, వారికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించి, సంపదకు కొత్త దారులు తెరుస్తుందట. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి కుంకుమ, పసుపు తిలకం దిద్దాలని చెబుతున్నారు. అక్షయ తృతీయ రోజున,అవసరంలో ఉన్నవారికి నీటితో నిండిన మట్టికుండ దానం చేయాలట.

దేవాలయానికి కూడా దానం చేయవచ్చట. ఇలా చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందట. అంతేకాకుండా ఈ రోజున మట్టి నీటి కుండను ఇంటికి తెచ్చుకున్నా కూడా ఆ ఇంట శుభం జరుగుతుందట. అక్షయ తృతీయ రోజున పితృదేవతలకు నైవేద్యం సమర్పిస్తారట. ఇలా చేయడం వల్ల జాతకంలోని పితృదోషం తొలగి, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే అక్షయ తృతీయ రోజున విసనకర్ర, గొడుగు, పంచదార, శనగపిండి దానం చేయాలట. అక్షయ తృతీయ రోజున మీ ఇంటి పూజగదిలో ఏకాక్షి కొబ్బరికాయ ఉంచాలట. దీంతో తల్లి లక్ష్మీదేవి సంతోషించి, భక్తుల జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తుందట.